పాక్‌లో బాంబు పేలుడు..ఆరుగురు మృతి

- October 18, 2017 , by Maagulf
పాక్‌లో బాంబు పేలుడు..ఆరుగురు మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్ధాన్‌లోని క్వెట్టా ప్రాంతంలో ఇవాళ బాంబు పేలుడు సంభంవించింది. ఈప్రమాదంలో 6 మంది పోలీసులు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. క్వెట్టా- సిబ్బి రహదారి సరియల్ మిల్లు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 35 మంది పోలీసులు వెళ్తున్న వాహనమే వారి లక్ష్యంగా ఈ దాడలు జరిగాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈనేపధ్యంలో ఘటనాస్ధలికి చేరుకున్న అధికారులు, భద్రతా సిబ్బంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఏ ఉగ్రసంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com