ఆఫ్గాన్ మిలటరీ బేస్ పై ఉగ్రదాడి, 41మంది సైనికులు మృతి
- October 19, 2017ఆఫ్గనిస్థాన్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. గురువారం కాందహార్ ప్రావిన్స్లోని సైనిక స్థావరంపై విరుచుకుపడ్డారు. రెండు కారు బాంబులను పేల్చిన ఘటనతో దాదాపు 41 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ రక్షణశాఖ ప్రతినిధి దౌలత్ వజిరీ సైనిక స్థావరంపై ఉగ్రదాడి జరిగినట్లు ధ్రువీకరించారు. అయితే.. మృతుల సంఖ్య మాత్రం వెల్లడించలేదు. ఆ దేశ మీడియా వర్గాల సమాచారం ప్రకారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాడికి బాధ్యత వహిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించుకున్నారు. తాలిబన్లను వ్యతిరేకిస్తూ ఆఫ్గాన్ దళాలు దాడులు చేస్తున్న నేపథ్యంలోనే ఆ కారు బాంబు పేలుడు జరిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ