పాకిస్థానీలకు సుష్మా దీపావళి కానుక.!
- October 19, 2017భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థానీయులకు దీపావళి కానుకను ఇచ్చారు. భారత్లో వైద్య చికిత్స నిమిత్తం మెడికల్ వీసాలను దరఖాస్తు చేసుకున్న వారందరికీ వీసాలు మంజూరు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. పెండింగ్లో ఉన్న మెడికల్ వీసాల దరఖాస్తుదారులందరికీ వీసాలను మంజూరు చేస్తున్నట్లు సుష్మాస్వరాజ్ గురువారం ట్విటర్లో వెల్లడించారు. పాకిస్థాన్కు చెందిన అమ్నా షమీన్ ఢి ల్లీలో చికిత్స పొందుతున్న తన తండ్రిని చూసేందుకు అనుమతి కోరుతూ సుష్మా సాయాన్ని కోరింది. అందుకు స్పందించిన ఆమె పాక్లోని భారత దౌత్య కార్యాలయ అధికారులను కలవాల్సిందిగా సూచించారు.
పాక్కు చెందిన మరో చిన్నారి వైద్య చికిత్స నిమిత్తం పాప తండ్రి మెడికల్ వీసా కోరుతూ సుష్మాను ఆశ్రయించారు. మరో పాకిస్థానీయురాలు భారత్లో కాలేయ శస్త్రచికిత్స చేయించుకునేందుకు వీసా దరఖాస్తు చేసుకున్నారు. పాక్ వాసి నజీర్ అహ్మద్ తన ఎనిమిదేళ్ల కూతురికి భారత్లో చికిత్స చేయించేందుకు వీసా కోరుతూ సుష్మా స్వరాజ్కు ట్వీట్ చేశారు. వీటన్నింటిపైనా సానుకూలంగా స్పందించిన సుష్మా అందరికీ వీసాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు