పాకిస్థానీలకు సుష్మా దీపావళి కానుక.!

- October 19, 2017 , by Maagulf
పాకిస్థానీలకు సుష్మా దీపావళి కానుక.!

భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ పాకిస్థానీయులకు దీపావళి కానుకను ఇచ్చారు. భారత్‌లో వైద్య చికిత్స నిమిత్తం మెడికల్‌ వీసాలను దరఖాస్తు చేసుకున్న వారందరికీ వీసాలు మంజూరు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. పెండింగ్‌లో ఉన్న మెడికల్‌ వీసాల దరఖాస్తుదారులందరికీ వీసాలను మంజూరు చేస్తున్నట్లు సుష్మాస్వరాజ్‌ గురువారం ట్విటర్‌లో వెల్లడించారు. పాకిస్థాన్‌కు చెందిన అమ్నా షమీన్‌ ఢి ల్లీలో చికిత్స పొందుతున్న తన తండ్రిని చూసేందుకు అనుమతి కోరుతూ సుష్మా సాయాన్ని కోరింది. అందుకు స్పందించిన ఆమె పాక్‌లోని భారత దౌత్య కార్యాలయ అధికారులను కలవాల్సిందిగా సూచించారు.

పాక్‌కు చెందిన మరో చిన్నారి వైద్య చికిత్స నిమిత్తం పాప తండ్రి మెడికల్‌ వీసా కోరుతూ సుష్మాను ఆశ్రయించారు. మరో పాకిస్థానీయురాలు భారత్‌లో కాలేయ శస్త్రచికిత్స చేయించుకునేందుకు వీసా దరఖాస్తు చేసుకున్నారు. పాక్‌ వాసి నజీర్‌ అహ్మద్‌ తన ఎనిమిదేళ్ల కూతురికి భారత్‌లో చికిత్స చేయించేందుకు వీసా కోరుతూ సుష్మా స్వరాజ్‌కు ట్వీట్‌ చేశారు. వీటన్నింటిపైనా సానుకూలంగా స్పందించిన సుష్మా అందరికీ వీసాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com