పాకిస్థానీలకు సుష్మా దీపావళి కానుక.!
- October 19, 2017
భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థానీయులకు దీపావళి కానుకను ఇచ్చారు. భారత్లో వైద్య చికిత్స నిమిత్తం మెడికల్ వీసాలను దరఖాస్తు చేసుకున్న వారందరికీ వీసాలు మంజూరు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. పెండింగ్లో ఉన్న మెడికల్ వీసాల దరఖాస్తుదారులందరికీ వీసాలను మంజూరు చేస్తున్నట్లు సుష్మాస్వరాజ్ గురువారం ట్విటర్లో వెల్లడించారు. పాకిస్థాన్కు చెందిన అమ్నా షమీన్ ఢి ల్లీలో చికిత్స పొందుతున్న తన తండ్రిని చూసేందుకు అనుమతి కోరుతూ సుష్మా సాయాన్ని కోరింది. అందుకు స్పందించిన ఆమె పాక్లోని భారత దౌత్య కార్యాలయ అధికారులను కలవాల్సిందిగా సూచించారు.
పాక్కు చెందిన మరో చిన్నారి వైద్య చికిత్స నిమిత్తం పాప తండ్రి మెడికల్ వీసా కోరుతూ సుష్మాను ఆశ్రయించారు. మరో పాకిస్థానీయురాలు భారత్లో కాలేయ శస్త్రచికిత్స చేయించుకునేందుకు వీసా దరఖాస్తు చేసుకున్నారు. పాక్ వాసి నజీర్ అహ్మద్ తన ఎనిమిదేళ్ల కూతురికి భారత్లో చికిత్స చేయించేందుకు వీసా కోరుతూ సుష్మా స్వరాజ్కు ట్వీట్ చేశారు. వీటన్నింటిపైనా సానుకూలంగా స్పందించిన సుష్మా అందరికీ వీసాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







