ఆఫ్గాన్ మిలటరీ బేస్ పై ఉగ్రదాడి, 41మంది సైనికులు మృతి
- October 19, 2017
ఆఫ్గనిస్థాన్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. గురువారం కాందహార్ ప్రావిన్స్లోని సైనిక స్థావరంపై విరుచుకుపడ్డారు. రెండు కారు బాంబులను పేల్చిన ఘటనతో దాదాపు 41 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ రక్షణశాఖ ప్రతినిధి దౌలత్ వజిరీ సైనిక స్థావరంపై ఉగ్రదాడి జరిగినట్లు ధ్రువీకరించారు. అయితే.. మృతుల సంఖ్య మాత్రం వెల్లడించలేదు. ఆ దేశ మీడియా వర్గాల సమాచారం ప్రకారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాడికి బాధ్యత వహిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించుకున్నారు. తాలిబన్లను వ్యతిరేకిస్తూ ఆఫ్గాన్ దళాలు దాడులు చేస్తున్న నేపథ్యంలోనే ఆ కారు బాంబు పేలుడు జరిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







