27 కిలోల గోల్డ్ జ్యుయెలరీ స్వాధీనం
- October 20, 2017అబుదాబీ పోలీసులు 27 కిలోల బంగారు ఆభరణాల్ని సీజ్ చేశారు. అబుదాబీలోని కమర్షియల్ మార్కెట్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 26 స్టోర్స్పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, ఈ కమర్షియల్ ఫ్రాడ్ బయటపడింది. వీటిల్లో 11 షాపులు ఒకరికే చెందినవి. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ హెడ్ బ్రిగేడియర్ డాక్టర్ రషీద్ మొహమ్మద్ బోర్షిద్ మాట్లాడుతూ, వుడెన్ షెల్వ్లలో దాచి ఉంచిన బంగారు నగల్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పేరుతో అక్రమంగా విక్రయిస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు జరిగాయని చెప్పారు. తనిఖీల నేపథ్యంలో కొందరిని విచారించామనీ, తదుపరి విచారణ నిమిత్తం ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగిందని ఆయన వివరించారు. వినియోగదారులు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అక్రమ అమ్మకాలపై ఏ చిన్న సమాచారం ఉన్నా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. అక్రమ మార్గాల్లో అమ్మకాల ద్వారా, అక్రమార్జనకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తప్పవని బ్రిగేడియర్ బోర్షిద్ హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం