27 కిలోల గోల్డ్ జ్యుయెలరీ స్వాధీనం
- October 20, 2017
అబుదాబీ పోలీసులు 27 కిలోల బంగారు ఆభరణాల్ని సీజ్ చేశారు. అబుదాబీలోని కమర్షియల్ మార్కెట్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 26 స్టోర్స్పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, ఈ కమర్షియల్ ఫ్రాడ్ బయటపడింది. వీటిల్లో 11 షాపులు ఒకరికే చెందినవి. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ హెడ్ బ్రిగేడియర్ డాక్టర్ రషీద్ మొహమ్మద్ బోర్షిద్ మాట్లాడుతూ, వుడెన్ షెల్వ్లలో దాచి ఉంచిన బంగారు నగల్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పేరుతో అక్రమంగా విక్రయిస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు జరిగాయని చెప్పారు. తనిఖీల నేపథ్యంలో కొందరిని విచారించామనీ, తదుపరి విచారణ నిమిత్తం ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగిందని ఆయన వివరించారు. వినియోగదారులు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అక్రమ అమ్మకాలపై ఏ చిన్న సమాచారం ఉన్నా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. అక్రమ మార్గాల్లో అమ్మకాల ద్వారా, అక్రమార్జనకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తప్పవని బ్రిగేడియర్ బోర్షిద్ హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







