యువకుడి హత్య, ఇద్దరు బహ్రెయినీలకు జీవిత ఖైదు
- October 20, 2017
మనామా: హై క్రిమినల్ కోర్టు, ఇద్దరు బహ్రెయినీలకు జీవిత ఖైదు విధించింది. ఓ యువకుడ్ని దారుణంగా హింసించి, హత్య చేసిన కేసులో ఈ శిక్ష విధించడం జరిగింది. పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో యువకుడ్ని ఈ ఇద్దరూ చిత్రవధ చేశారు. బాధితుడ్ని సయ్యెద్ అహ్మద్ సయెద్ మోసాగా గుర్తించారు. షకురా విలేజ్ నుంచి ఇతన్ని కిడ్నాప్ చేసిన నిందితులు, పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో తీవ్రంగా హింసించారు. ఆ హింసను తాళలేక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు బాధితుడు. అతన్ని ఆ స్థితిలో గుర్తించిన పోలీసులు, సలమానియా మెడికల్ కాంప్లెక్స్కి తరలించారు. సోషల్ మీడియాలో అతని ఫొటోని చూసి, బాధితుడి తండ్రి అతన్ని గుర్తించడం జరిగింది. విచారణలో బాధితుడి స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. అతనితోపాటు మరో వ్యక్తి కూడా ఈ ఘటనలో దోషిగా తేలడంతో ఇద్దరికీ జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









