యువకుడి హత్య, ఇద్దరు బహ్రెయినీలకు జీవిత ఖైదు
- October 20, 2017
మనామా: హై క్రిమినల్ కోర్టు, ఇద్దరు బహ్రెయినీలకు జీవిత ఖైదు విధించింది. ఓ యువకుడ్ని దారుణంగా హింసించి, హత్య చేసిన కేసులో ఈ శిక్ష విధించడం జరిగింది. పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో యువకుడ్ని ఈ ఇద్దరూ చిత్రవధ చేశారు. బాధితుడ్ని సయ్యెద్ అహ్మద్ సయెద్ మోసాగా గుర్తించారు. షకురా విలేజ్ నుంచి ఇతన్ని కిడ్నాప్ చేసిన నిందితులు, పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో తీవ్రంగా హింసించారు. ఆ హింసను తాళలేక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు బాధితుడు. అతన్ని ఆ స్థితిలో గుర్తించిన పోలీసులు, సలమానియా మెడికల్ కాంప్లెక్స్కి తరలించారు. సోషల్ మీడియాలో అతని ఫొటోని చూసి, బాధితుడి తండ్రి అతన్ని గుర్తించడం జరిగింది. విచారణలో బాధితుడి స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. అతనితోపాటు మరో వ్యక్తి కూడా ఈ ఘటనలో దోషిగా తేలడంతో ఇద్దరికీ జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







