ఇండియాలో మొట్టమొదటి జడ్జిగా తొలి ట్రాన్స్‌జెండర్

- October 21, 2017 , by Maagulf
ఇండియాలో మొట్టమొదటి జడ్జిగా తొలి ట్రాన్స్‌జెండర్

అబ్బాయిగా పుట్టినా అమ్మాయి లక్షణాలు వచ్చాయి. సమాజం వెక్కిరించింది. ఇంట్లో వాళ్లు చీదరించుకున్నారు. అయినా కుంగిపోలేదు. కష్టాలకు ఎదురీదింది జోయితా మొండల్. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 29 ఏళ్ల జోయితా మొండల్ తొలి ట్రాన్స్ జెండర్ జడ్జిగా నియమితురాలైంది. కోల్‌కతా వర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో పట్టాపుచ్చుకుంది.  హిజ్రాల హక్కుల కోసం ఓ ఎన్జీవోను స్థాపించి ఉద్యమాలు నిర్వహించింది.  ఈ సంస్థలో మూడు వేల మంది హిజ్రాలకు సభ్యత్వముంది. తనలాంటి వారికి ఎలాంటి కష్టం కలగకుండా సామాజిక సేవనే మార్గంగా ఎంచుకుంది. ఇతరుల కష్టాలను పంచుకుంది. ఇప్పుడు బెంగాల్‌లోని నార్త్ దినాజ్‌పూర్ జిల్లా ఇస్లాంపూర్ లోక్‌ అదాలత్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తోంది. 

తొలి ట్రాన్స్‌జెండర్ జడ్జిగా సేవలందిస్తోంది జోయితా మొండల్. జీవితంలో ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొన్న జోయితా .. లోక్ అదాలత్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మిగితా వారికి ఆదర్శంగా నిలుస్తోంది. తనలా మిగతా ట్రాన్స్ జెండర్స్ కూడా రాణించి ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తోంది. 3 నెలల క్రితం సోషల్ వర్కర్ కేటగిరీ కింద జోయితా జడ్జిగా ఎంపికయ్యారు. విధి నిర్వహణలో సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అవకాశాలు కల్పిస్తే ట్రాన్స్ జెండర్లు కూడా విభిన్న రంగాల్లో తమ ప్రతిభ చాటుకుంటారని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com