కేటలోనియా ప్రభుత్వ సస్పెన్షన్, ఆరునెలల్లో ఎన్నికలు
- October 21, 2017
స్పెయిన్ నుండి విడిపోవాలన్న కేటలోనియా ప్రభుత్వ డిమాండ్ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన స్పెయిన్ ప్రభుత్వం కేటలోనియా స్థానిక ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి అక్కడ ఆరునెలల్లో తాజా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇక్కడి మన్క్లోవా పాలెస్లో ప్రధాని మరియానా రోజరు అధ్యక్షతన శనివారం జరిగిన మంత్రివర్గ ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతాన్ని వేర్పాటు వాదంనుండి కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ప్రధాని రజోరు కేబినెట్ భేటీ అనంతరం మీడియాకు వివరించారు. మంత్రివర్గ నిర్ణయానికి పార్లమెంట్ ఎగువ సభ సెనేట్ ఆమోదం లభించాల్సి వుంది. స్థానిక ప్రభుత్వ వేర్పాటు వాద డిమాండ్తో దేశ ఆర్థిక వ్యవస్థలో ఐదో వంతు వున్న కేటలోనియా భారీ మూల్యాన్నే చెల్లించుకుంటోందని ప్రధాని రజోరు వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు మంత్రివర్గ నిర్ణయానికి ఆమోదముద్ర వేయాలని తాము సెనేట్ను కోరనున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









