పాక్ లో చైనా రాయబారిని చంపేందుకు కుట్ర
- October 22, 2017
పాక్ ఆత్మబంధువుగా పేరున్న చైనా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాకిస్థాన్లో నియమించిన చైనా రాయబారిని హతమార్చేందుకు ఓ ఉగ్రబృందం సిద్ధమైంది. చైనాలోని జిన్జియంగ్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించే ఇస్లామిక్ ఉగ్రసంస్థకు కొందరు ముష్కరులు పాకిస్థాన్లో ప్రవేశించారు. వీరు తమ రాయబారి కోసమే పాక్లోకి వచ్చినట్లు చైనా అనుమానిస్తోంది. వెంటనే తమ రాయబారి, చైనా సిబ్బంది, చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్లో పనిచేసే చైనీయులకు భద్రత కల్పించాలని పాక్కు లేఖ రాసింది. ఈ లేఖతోపాటు అబ్దుల్ వాలి అనే ఒక ఉగ్రవాది పాస్పోర్టు వివరాలను కూడా పాక్కు అందజేసింది. ఈ లేఖను పాకిస్థాన్ స్థానిక మీడియా సంస్థ ఒకటి ప్రచురించింది. ఇటీవలే పాకిస్థాన్లో చైనా కొత్త రాయబారిని నియమించింది. అప్పటి వరకు అక్కడ పనిచేసిన సన్ వైడాంగ్ను చైనాకు రప్పించి..ఆఫ్గనిస్థాన్లో రాయబారిగా పనిచేస్తున్న యో జింగ్ను పాకిస్థాన్లో నియమించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









