పాక్ లో చైనా రాయబారిని చంపేందుకు కుట్ర
- October 22, 2017
పాక్ ఆత్మబంధువుగా పేరున్న చైనా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాకిస్థాన్లో నియమించిన చైనా రాయబారిని హతమార్చేందుకు ఓ ఉగ్రబృందం సిద్ధమైంది. చైనాలోని జిన్జియంగ్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించే ఇస్లామిక్ ఉగ్రసంస్థకు కొందరు ముష్కరులు పాకిస్థాన్లో ప్రవేశించారు. వీరు తమ రాయబారి కోసమే పాక్లోకి వచ్చినట్లు చైనా అనుమానిస్తోంది. వెంటనే తమ రాయబారి, చైనా సిబ్బంది, చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్లో పనిచేసే చైనీయులకు భద్రత కల్పించాలని పాక్కు లేఖ రాసింది. ఈ లేఖతోపాటు అబ్దుల్ వాలి అనే ఒక ఉగ్రవాది పాస్పోర్టు వివరాలను కూడా పాక్కు అందజేసింది. ఈ లేఖను పాకిస్థాన్ స్థానిక మీడియా సంస్థ ఒకటి ప్రచురించింది. ఇటీవలే పాకిస్థాన్లో చైనా కొత్త రాయబారిని నియమించింది. అప్పటి వరకు అక్కడ పనిచేసిన సన్ వైడాంగ్ను చైనాకు రప్పించి..ఆఫ్గనిస్థాన్లో రాయబారిగా పనిచేస్తున్న యో జింగ్ను పాకిస్థాన్లో నియమించింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







