రోహింగ్యాలకు రూ.260 కోట్ల ఆర్థికసాయం చేసిన అమెరికా
- October 23, 2017
దినదిన గండంగా శరణార్థి శిబిరాల్లో బతుకు వెళ్లదీస్తున్న రోహింగ్యా ముస్లింపై ట్రంప్ సర్కార్ కరుణ చూపించింది. తాజాగా మరో రూ.260 కోట్ల అత్యవసర ఆర్థిక సాయం ప్రకటించింది. దీంతో రోహింగ్యాల శ్రేయస్సుకు ఇప్పటివరకు ప్రకటించిన ఆర్థిక సాయం రూ.675 కోట్లకు చేరింది. ఐరాస అనుబంధ సంస్థలు యూనిసెఫ్, శరణార్థి, వలసల నివారణ సంస్థలకు అమెరికా ఈ మొత్తాన్ని అందజేసింది. రోహింగ్యా ముస్లింలకు ఆవాసం, ఆహారం, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అంతర్జాతీయ సంస్థలు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నాయి. మయన్మార్లో సైనికుల దురాగతాలను నుంచి తప్పించుకుంటూ సరిహద్దులు దాటుకుని వచ్చిన రోహింగ్యాలకు అండగా నిలిచిన బంగ్లాదేశ్ సర్కార్ను అగ్రరాజ్యం ప్రశంసించింది. రఖైన్ రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేక సలహా కమిటీ సిఫారస్సులను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్న మయన్మార్ సర్కార్ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







