బ్రిటన్లోని రెస్టారెంట్లలో ఆహార పదార్థాలు గాల్లో తేలుతూ... నోటి దగ్గరకే ఆహారం
- October 23, 2017
రెస్టారెంట్లలో ఆహార పదార్థాలు గాల్లో తేలుకుంటూ నేరుగా మన నోటి దగ్గరకు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి బాటలు పరిచే పరిజ్ఞానాన్ని బ్రిటన్లోని ససెక్స్ వర్సిటీ నిపుణులు అభివృద్ధి చేశారు. అత్యధిక పౌనఃపున్య శబ్ద తరంగాల సాయంతో ఆహార పదార్థాలను గాల్లోకి లేపడంపై వారు దృష్టిసారించారు. ఒకే పౌనఃపున్యంతో రెండు భిన్న తరంగాలను ఎదురెదురుగా పంపితే జనించే స్థిర తరంగాలతో ఆహారాన్ని తరలించొచ్చని నిరూపించారు. 'స్థిర తరంగాలతో... ఆహారం బరువు తగ్గడంతోపాటు గాల్లో స్థిరంగా ఉంటుంది. దీంతో కన్వేయర్ బెల్ట్పై పంపినట్టే పదార్థాలను గాల్లో పంపించొచ్చు'అని పరిశోధకులు షీ తన్నావీ తెలిపారు. అంతేకాదు ఆహారం గాల్లో తేలుకుంటూ వస్తే.. దానిలోని తీపిదనం కూడా పెరుగుతుందని వివరించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







