వరుసగా మూడోరోజూ తగ్గిన బంగారం ధర
- October 23, 2017
వరుసగా మూడోరోజూ పసిడి ధర తగ్గింది. అంతర్జాతీయ విపణిలో బులియన్ ధరలు రెండు వారాల కనిష్ఠస్థాయికి చేరడం, దేశీయంగా ఆభరణాల విక్రేతలు, కొనుగోలుదార్ల నుంచి గిరాకీ తగ్గడం ఇందుకు కారణమని చెబుతున్నారు. మేలిమి బంగారం (999 స్వచ్ఛత) 10 గ్రాముల ధర రూ.166 తగ్గి, రూ.29,555కు చేరింది. కిలో వెండి ధర రూ.391 తగ్గి, రూ.39,420కి పరిమితమైంది. ఇక అంతర్జాతీయ విపణిలో చూస్తే, డాలర్ బలపడటం వల్ల, పసిడికి గిరాకీ తగ్గింది. ఔన్సు (31.10 గ్రాములు) బంగారం 1273 డాలర్ల వద్ద ఉంది.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







