దుబాయ్లో ఈనెల 27న '2.0' సినిమా ఆడియో వేడుక
- October 25, 2017
సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన '2.0' సినిమా ఆడియో వేడుక దుబాయ్లో ఈనెల 27న అట్టహాసంగా జరగబోతోంది. ఈ కార్యక్రమం కోసం దుబాయ్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేజ్ అలంకరణ ఫొటోను చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేత రాజు మహాలింగం ట్విటర్లో పోస్ట్ చేశారు.
దుబాయ్ నగరాన్ని మరో మూడు రోజుల పాటు '2.0' నగరంగా పిలుచుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమల్ హాసన్ హాజరుకానున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ ఆడియో వేడుకను నిర్వహిస్తున్నారు. అతిథులకు కేటాయించిన ఒక్కో టేబుల్కి రూ.6లక్షలు ఖర్చు చేస్తున్నట్లుతెలుస్తోంది.
ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ అరగంట పాటు లైవ్ ప్రదర్శన ఇవ్వనున్నారు. సినిమాలో కేవలం ఒక్క పాటే ఉందట. మిగతా పాటలను రెహమాన్ లైవ్ ప్రదర్శన ఇవ్వనున్నట్లు తమిళ వర్గాల సమాచారం.
ఆ తర్వాత నవంబర్లో సినిమా ట్రైలర్ విడుదల చేస్తారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకి జోడీగా అమీ జాక్సన్ నటించింది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. 2018 జనవరిలో ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







