ఉత్తర్ప్రదేశ్లో స్విస్ జంటపై దాడి.. స్పందించిన సుష్మా
- October 26, 2017
ఉత్తర్ప్రదేశ్లో గత ఆదివారం ఓ విదేశీ జంటపై జరిగిన దాడిపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. ఈ ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలంటూ యూపీ ప్రభుత్వాన్ని కోరారు. 'దాడి గురించి నాకు ఇప్పుడే తెలిసింది. దీనిపై యూపీ ప్రభుత్వాన్ని నివేదిక అడిగాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత జంటను మా అధికారులు కలుస్తారు.' అని సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు.
స్విట్జర్లాండ్కు చెందిన క్వెంటిన్ జెరెమీ క్లెర్క్ తన ప్రేయసి మ్యారీ డ్రోజ్తో కలిసి సెప్టెంబర్ 30న భారత్ పర్యటనకు వచ్చారు. గత ఆదివారం వారు యూపీలో ఫతేపూర్ సిక్రీ రైల్వే స్టేషన్ సమీపంలో నడుస్తుండగా.. కొందరు స్థానిక యువకులు దాడి చేశారు. వారిని వెంబడించి రాళ్లతో కొట్టారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో క్వెంటిన్, మ్యారీ గాయపడ్డారు.
బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి ఎందుకు చేశారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









