సయీద్ షాహిద్ నివాసంపై ఎన్ఐఏ మెరుపుదాడి
- October 26, 2017
ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత సయ్యద్ సలావుద్దీన్ కుమారుడు సయ్యద్ షాహిద్ యూసఫ్ ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు సోదాలు చేపట్టారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలపై గత మంగళవారం యూసఫ్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ చేపట్టిన ఎన్ఐఏ అధికారులు నేడు తనిఖీలు చేపట్టారు. బుద్గాం జిల్లాలోని సోయ్బుగ్ గ్రామంలోని యూసఫ్ నివాసంలో ఈ ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు.
యూసఫ్ ప్రస్తుతం జమ్ముకశ్మీర్ ప్రభుత్వంలోని వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్నాడు. 2011లోని కేసుకు సంబంధించి ఆయనకు సమన్లు అందడంతో గత మంగళవారం అతడు ఎన్ఐఏ ఎదుట హాజరయ్యాడు. ఈ సందర్భంగా విచారించిన అధికారులు అతడిని అరెస్టు చేశారు. సయ్యద్ సలావుదీన్ ఆదేశాల మేరకు 2011-14 మధ్య గులామ్ మహ్మద్ భట్(ఇవే ఆరోపణలపై ప్రస్తుతం జైల్లో ఉన్నాడు).. యూసఫ్కు డబ్బులు బదిలీ చేసినట్లు తమ వద్ద సాక్ష్యాలున్నాయని అధికారులు తెలిపారు. ఈ కేసులోతదుపరి విచారణ కోసం యూసఫ్ను ఏడు రోజుల కస్టడీకి తరలించారు.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









