సయీద్ షాహిద్ నివాసంపై ఎన్ఐఏ మెరుపుదాడి
- October 26, 2017
ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత సయ్యద్ సలావుద్దీన్ కుమారుడు సయ్యద్ షాహిద్ యూసఫ్ ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు సోదాలు చేపట్టారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలపై గత మంగళవారం యూసఫ్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ చేపట్టిన ఎన్ఐఏ అధికారులు నేడు తనిఖీలు చేపట్టారు. బుద్గాం జిల్లాలోని సోయ్బుగ్ గ్రామంలోని యూసఫ్ నివాసంలో ఈ ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు.
యూసఫ్ ప్రస్తుతం జమ్ముకశ్మీర్ ప్రభుత్వంలోని వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్నాడు. 2011లోని కేసుకు సంబంధించి ఆయనకు సమన్లు అందడంతో గత మంగళవారం అతడు ఎన్ఐఏ ఎదుట హాజరయ్యాడు. ఈ సందర్భంగా విచారించిన అధికారులు అతడిని అరెస్టు చేశారు. సయ్యద్ సలావుదీన్ ఆదేశాల మేరకు 2011-14 మధ్య గులామ్ మహ్మద్ భట్(ఇవే ఆరోపణలపై ప్రస్తుతం జైల్లో ఉన్నాడు).. యూసఫ్కు డబ్బులు బదిలీ చేసినట్లు తమ వద్ద సాక్ష్యాలున్నాయని అధికారులు తెలిపారు. ఈ కేసులోతదుపరి విచారణ కోసం యూసఫ్ను ఏడు రోజుల కస్టడీకి తరలించారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









