కంటి చూపును మెరుగుపరిచే చిట్కా
- October 27, 2017
ఈ కాలంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఖచ్చితంగా కళ్ళజోడు ఉంటుంది. రోజురోజుకు కళ్ళ జోడు పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కంటి చూపు మందగిస్తుంది. చాలా మంది చిన్నప్పటి నుంచే ఎక్కువ సైట్ కలిగిన కంటద్దాలను వాడుతున్నారు. కంటి చూపు మందగించడం వల్ల వేరే కంటి సమస్యలు వస్తున్నాయి. మన తాతల కాలంలో సరైన ఆహారం తీసుకోవడం వల్ల వారికి కంటి సమస్యలు వచ్చేది కాదు. కానీ మనం ఏది పడితే అది తినడం వల్ల కంటి చూపు సమస్య వస్తోంది. విటమిన్ లోపం వల్ల కంటి చూపు వస్తోంది.
చాలా మంది కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి లేజర్ ఆపరేషన్లకు వెళుతుంటారు. కానీ ఇది మంచిది కాదు. కొన్ని చిట్కాలను పాటిస్తే కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. అదే కుంకుమ పువ్వు. ఒక కప్ తాగునీరు, ఒక గ్రాము కుంకుమ పువ్వు తీసుకోవాలి.
ఒక పాత్రలో నీరు పోసి బాగా వేడైన తర్వాత అందులో కుంకుమ పువ్వు వేసి ఒక నిమిషం మాత్రమే తక్కువ మంటతో వెలిగించాలి. ఆ తర్వాత స్టౌ ఆపి పూర్తిగా మిశ్రమం చల్లారిన తర్వాత మీకు తియ్యదనం కోసం తేనె కలిపి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా చేస్తే మీ కంటిచూపు మెరుగుపడుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









