కంటి చూపును మెరుగుపరిచే చిట్కా
- October 27, 2017
ఈ కాలంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఖచ్చితంగా కళ్ళజోడు ఉంటుంది. రోజురోజుకు కళ్ళ జోడు పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కంటి చూపు మందగిస్తుంది. చాలా మంది చిన్నప్పటి నుంచే ఎక్కువ సైట్ కలిగిన కంటద్దాలను వాడుతున్నారు. కంటి చూపు మందగించడం వల్ల వేరే కంటి సమస్యలు వస్తున్నాయి. మన తాతల కాలంలో సరైన ఆహారం తీసుకోవడం వల్ల వారికి కంటి సమస్యలు వచ్చేది కాదు. కానీ మనం ఏది పడితే అది తినడం వల్ల కంటి చూపు సమస్య వస్తోంది. విటమిన్ లోపం వల్ల కంటి చూపు వస్తోంది.
చాలా మంది కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి లేజర్ ఆపరేషన్లకు వెళుతుంటారు. కానీ ఇది మంచిది కాదు. కొన్ని చిట్కాలను పాటిస్తే కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. అదే కుంకుమ పువ్వు. ఒక కప్ తాగునీరు, ఒక గ్రాము కుంకుమ పువ్వు తీసుకోవాలి.
ఒక పాత్రలో నీరు పోసి బాగా వేడైన తర్వాత అందులో కుంకుమ పువ్వు వేసి ఒక నిమిషం మాత్రమే తక్కువ మంటతో వెలిగించాలి. ఆ తర్వాత స్టౌ ఆపి పూర్తిగా మిశ్రమం చల్లారిన తర్వాత మీకు తియ్యదనం కోసం తేనె కలిపి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా చేస్తే మీ కంటిచూపు మెరుగుపడుతుంది.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు







