ఇకపై మధ్యేవాద విధానాలు పాటిస్తామని సౌదీ యువరాజు ప్రకటన

- October 28, 2017 , by Maagulf
ఇకపై మధ్యేవాద విధానాలు పాటిస్తామని సౌదీ యువరాజు ప్రకటన

రియాధ్‌ : తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తామని, మధ్యేమార్గ ఇస్లామ్‌ విధానాలను అనుసరిస్తామని సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ప్రకటించారు. అన్ని మతాల వారికి ద్వారాలు తెరిచామని గురువారం  ఇక్కడ జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో ఆయన ప్రకటించగానే ఒక్కసారిగా హర్షధ్వానాలు చెలరేగాయి. తీవ్రవాద భావజాలంతో మా జీవితాలను 30ఏళ్ళు వృధా చేసుకోదలుచుకోలేదని, తీవ్రవాదాన్ని సమూలంగా పారద్రోలుతామని అన్నారు. కఠినమైన ఇస్లాం విధానాలు పునాదిగా ఏర్పడిన ఈ దేశంలో ఇప్పుడు ఆ భావనలు ప్రభావం చూపడం లేదని భావిస్తున్న నేపథ్యంలో యువరాజు వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఎర్ర సముద్రం తీరంలో 500 బిలియన్ల డాలర్ల వ్యయంతో కొత్త నగరాన్ని నిర్మించాలని యోచిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో లేని జీవన విధానాన్ని ఈ కొత్త నగరంలో తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. 2015 నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ అధికారాన్ని చేపట్టిన ఆయన అనేక సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తున్నారు. చమురు రంగంలో అగ్రగామి సంస్థ సౌదీ అరామ్‌కో లో కొంత వాటాను విక్రయించి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సార్వభౌమ సంపన్న నిధిని ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు చెప్పారు. సామాజికంగా నెలకొన్న కొన్ని అవరోధాలను కూడా అధిగమించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com