ఇకపై మధ్యేవాద విధానాలు పాటిస్తామని సౌదీ యువరాజు ప్రకటన
- October 28, 2017రియాధ్ : తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తామని, మధ్యేమార్గ ఇస్లామ్ విధానాలను అనుసరిస్తామని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. అన్ని మతాల వారికి ద్వారాలు తెరిచామని గురువారం ఇక్కడ జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో ఆయన ప్రకటించగానే ఒక్కసారిగా హర్షధ్వానాలు చెలరేగాయి. తీవ్రవాద భావజాలంతో మా జీవితాలను 30ఏళ్ళు వృధా చేసుకోదలుచుకోలేదని, తీవ్రవాదాన్ని సమూలంగా పారద్రోలుతామని అన్నారు. కఠినమైన ఇస్లాం విధానాలు పునాదిగా ఏర్పడిన ఈ దేశంలో ఇప్పుడు ఆ భావనలు ప్రభావం చూపడం లేదని భావిస్తున్న నేపథ్యంలో యువరాజు వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఎర్ర సముద్రం తీరంలో 500 బిలియన్ల డాలర్ల వ్యయంతో కొత్త నగరాన్ని నిర్మించాలని యోచిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో లేని జీవన విధానాన్ని ఈ కొత్త నగరంలో తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. 2015 నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ అధికారాన్ని చేపట్టిన ఆయన అనేక సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తున్నారు. చమురు రంగంలో అగ్రగామి సంస్థ సౌదీ అరామ్కో లో కొంత వాటాను విక్రయించి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సార్వభౌమ సంపన్న నిధిని ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు చెప్పారు. సామాజికంగా నెలకొన్న కొన్ని అవరోధాలను కూడా అధిగమించారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన