ఉరితీయాలంటూ ప్రియ తల్లిదండ్రులు ఆగ్రహం
- October 29, 2017
దిల్లీ: దిల్లీలో ఇటీవల ప్రియా మెహ్రా అనే వివాహితపై కాల్పులు జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ కేసులో నిందితుడైన ప్రియ భర్త పంకజ్ మెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కేవలం దర్యాప్తు చేసి జైల్లో పెట్టడం కాకుండా పంకజ్ను ఉరితీయాలంటూ ప్రియ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రియ, పంకజ్ ప్రేమించి వివాహం చేసుకున్నారని, ఇప్పుడు ఇలా హత్య చేసి చంపుతాడని అసలు వూహించలేదని పంకజ్ తండ్రి తెలిపారు. అప్పు ఎగ్గొట్టడానికి పంకజ్ ఈ మర్డర్ ప్లాన్ వేసినట్లు విచారణలో తెలిపాడు. అదీకాకుండా అతనికి రెస్టారెంట్లో పనిచేస్తున్న ఓ గాయనితోవివాహేతర సంబంధం ఉందని కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఆమెతోకలిసి ఉండేందుకే భార్యను వదిలించుకోవాలనుకున్నాడని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పంకజ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







