చైనాలోజాతీయగీతాన్ని అవమానిస్తే మూడేళ్లు జైలుకే
- October 31, 2017
ఓ పక్క భారతదేశంలో జాతీయ గీతం ప్రసారమవుతున్నప్పుడు నిలబడాలా వద్దా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పొరుగు దేశమైన చైనా తమ జాతీయజెండాకు సంబంధించి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. బహిరంగ ప్రదేశాల్లో తమ జాతీయ జెండాను అవమానించినా, జాతీయ గీతాన్ని గౌరవించకపోయినా మూడేళ్లు జైలు శిక్షతో పాటు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం త్వరలో చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టనుంది. జాతీయ గీతం ప్రసారం అవుతున్నప్పుడు ఎవరన్నా అవమానకరంగా ప్రవర్తిస్తే వారిని 15 రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉంచాల్సిందిగా సెప్టెంబర్లో చైనా కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు కొత్తగా జాతీయ గీతంలోని అక్షరాలు కావాలని తప్పుగా పాడినా, అవమానించినా మూడేళ్లు కారాగార శిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తీసుకురానుంది. దీనిపై ఈ వారంలోనే పార్లమెంట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 2015లో హాంకాంగ్లో ఫుట్బాల్ వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో జాతీయ గీతం ప్రసారమవుతున్నప్పుడు పలువురు వ్యక్తులు అవమానకరంగా ప్రవర్తించారని వారికి ఫుట్బాల్ అసోసియేషన్ యాజమ్యాం జరిమానా విధించింది. ఈ ఏడాది ఆగస్ట్లో చైనాలోని ఓ స్మారకస్థూపం వద్ద ముగ్గురు వ్యక్తులు సైనికుల దుస్తులు వేసుకుని సెల్ఫీలు దిగుతుండడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







