సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఒక్కటి చేశారు: మోడీ
- October 31, 2017
మాజీ ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నేషనల్ యూనిటీ డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశాన్నంతా ఏకం చేసిన ఉక్కుమనిషి పటేల్ 143వ జయంతి సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో రన్ ఫర్ యూనిటీ నిర్వహిస్తున్నారు. దేశరాజధాని ఢిల్లీలోని ధ్యాన్ చంద్ స్టేడియంలో జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.
నేషనల్ యూనిటీ డే సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించారు. నవభారత నిర్మాణంలో పటేల్ కృషి మరవలేనిదన్నారు. స్వాతంత్రానంతరం దేశాన్నంతా వల్లభాయ్ పటేల్ ఒక్కటి చేశారన్నారు. ఎంతోమంది కుట్రలను ఛేదించి దేశంలో ఐక్యత సాధించారన్నారు. లౌకికవాదం, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం ప్రత్యేకతగా ప్రధాని వర్ణించారు. సరికొత్త భారత్ కోసం అందరం కలసి పనిచేద్దామని పిలుపునిచ్చిన మోడీ... ఐక్యతా పరుగులో యువత అధికారికంగా పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఐక్యతా పరుగులో పాల్గొనేందుకు ఢిల్లీ వాసులు, బీజేపీ కార్యకర్తలు స్టేడియానికి భారీగా తరలివచ్చారు. ఇండియా గేట్ వద్ద జరిగే రన్ ఫర్ యూనిటీలో ఒలింపిక్ రజత పతక విజేత, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, హాకీ ప్లేయర్ సర్దార్ సింగ్.. పాల్గొన్నారు. ప్రధాని జెండా ఊపి రన్ ఫర్ యూనిటీని ప్రారంభించారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మాట్లాడిన ప్రధాని అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఐక్యతా పరుగులో దేశ ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. 2014లో ఎన్డీయే అధికారంలోకి రాగానే పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి ఏటా పటేల్ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







