దొంగతనం కేసులో మహిళకు ఊరట

- November 01, 2017 , by Maagulf
దొంగతనం కేసులో మహిళకు ఊరట

టెనెంట్‌ వద్ద నుంచి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువుల్ని దొంగిలించిన కేసులో ఆరోపనలు ఎదుర్కొంటున్న మహిళకు ఊరట లభించింది. ఫిలిప్పినో మహిళ ఒకరు, ఆసియాకి చెందిన మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి నుంచి విలువైన వస్తువులు తస్కరణకు గురయ్యాయని ఆమె ఓ మహిళపై ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఆమెను విచారించారు. ఈ కేసులో రెండో మహిళను దోషిగా న్యాయస్థానం తేల్చింది. అయితే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఆసియా మహిళ అబుదాబీ అపీల్‌ కోర్టును ఆశ్రయించారు. ఫిలిప్పినో మహిళ, రెంట్‌ నుంచి తప్పించుకునేందుకు ఈ నాటకం ఆడినట్లుగా ఆమె వాదన విన్పించారు. ఆ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆసియా మహిళకు విధించిన శిక్షను కొట్టివేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com