తీవ్రవాద నేరం: 10 మందికి జీవిత ఖైదు
- November 01, 2017
మనామా: హై క్రిమినల్ కోర్టు, 10 మందికి జీవిత శిక్షను విధించింది. అలాగే వారి పౌరసత్వాన్ని కూడా రద్దు చేయాలని ఆదేశించింది. తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేసి, దాడులకు పాల్పడిన నేరానికిగాను ఈ శిక్షలు ఖరారు చేసినట్లు చీఫ్ ఆఫ్ టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అహ్మద్ అల్ హమ్మాది చెప్పారు. తొమ్మిది మంది నిందితులకు అదనంగా 100 బహ్రెయినీ దినార్స్ జరీమానాతోపాటుగా, నెల రోజుల జైలు శిక్షను అక్రమంగా కత్తిని కలిగి ఉన్న నేరానికిగాను విధించారు. నిందితులు ఆయుధాల్ని అలాగే బాంబుల్ని ఉపయోగించడంలో శిక్షణ పొందారు. బహ్రెయిన్ కింగ్డమ్లో విధ్వంసాలు సృష్టించడమే లక్ష్యంగా వీరు తీవ్రవాద సంస్థను నెలకొల్పారు. ఓ వ్యక్తి ఇరాక్కి వెళ్ళి అక్కడే శిక్షణ పొంది, పది మంది బహ్రెయినీలను రిక్రూట్ చేసి, ఇరాన్ మరియు ఇరాక్కి పంపాడు. అక్కడ వారికి శిక్షణ ఇప్పించిన ఆ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. మిగతావారంతా బహ్రెయిన్కి తిరిగి వచ్చి తీవ్రవాద కార్యకలాపాల్లో జోరు పెంచారు. వీరి అరెస్ట్ సందర్భంగా పలు ఆయుధాలు, పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!