తీవ్రవాద నేరం: 10 మందికి జీవిత ఖైదు
- November 01, 2017
మనామా: హై క్రిమినల్ కోర్టు, 10 మందికి జీవిత శిక్షను విధించింది. అలాగే వారి పౌరసత్వాన్ని కూడా రద్దు చేయాలని ఆదేశించింది. తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేసి, దాడులకు పాల్పడిన నేరానికిగాను ఈ శిక్షలు ఖరారు చేసినట్లు చీఫ్ ఆఫ్ టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అహ్మద్ అల్ హమ్మాది చెప్పారు. తొమ్మిది మంది నిందితులకు అదనంగా 100 బహ్రెయినీ దినార్స్ జరీమానాతోపాటుగా, నెల రోజుల జైలు శిక్షను అక్రమంగా కత్తిని కలిగి ఉన్న నేరానికిగాను విధించారు. నిందితులు ఆయుధాల్ని అలాగే బాంబుల్ని ఉపయోగించడంలో శిక్షణ పొందారు. బహ్రెయిన్ కింగ్డమ్లో విధ్వంసాలు సృష్టించడమే లక్ష్యంగా వీరు తీవ్రవాద సంస్థను నెలకొల్పారు. ఓ వ్యక్తి ఇరాక్కి వెళ్ళి అక్కడే శిక్షణ పొంది, పది మంది బహ్రెయినీలను రిక్రూట్ చేసి, ఇరాన్ మరియు ఇరాక్కి పంపాడు. అక్కడ వారికి శిక్షణ ఇప్పించిన ఆ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. మిగతావారంతా బహ్రెయిన్కి తిరిగి వచ్చి తీవ్రవాద కార్యకలాపాల్లో జోరు పెంచారు. వీరి అరెస్ట్ సందర్భంగా పలు ఆయుధాలు, పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









