బహ్రెయిన్ ఎక్స్పోలో ప్రధాన ఆకర్షణగా తొమ్మిదేళ్ళ బాలిక
- November 02, 2017
మానామ: తొమ్మిదేళ్ళ బాలిక, బహ్రెయిన్ ఎంటర్ప్రెన్యూసర్స్ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యంగ్ ఎంటర్ప్రెన్యూర్ జుమానా అల్ జెన్జి, వందలాదిమంది ఎంటర్ప్రెన్యూర్స్లో ఒకరుగా ఈ వెంట్లో పాల్గొంది. రెండేళ్ళుగా నిర్వహిస్తోన్న 'జుజు స్వీట్ స్పా'కి సంబంధించి ఆమె ఓ చిన్న స్టాల్ నిర్వహించడం జరుగుతోంది. ఈ స్టాల్ ఇప్పుడు బహ్రెయిన్ ఎక్స్పోలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచింది. తొమ్మిదేళ్ళ బాలిక ఎంటర్ప్రెన్యూర్గా రాణిస్తున్న వైనం సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏడేళ్ళ నుంచే అల్ జెన్జి ఎక్స్ఫోలియాంట్స్ని తయారు చేయడం, విక్రయించడం ప్రారంభించింది. తాను తయారు చేసి విక్రయించే స్క్రబ్స్ డెడ్ స్కిన్ని తొలగించడంతోపాటుగా జెర్మ్స్, బ్యాక్టీరియాని కూడా తొలగిస్తాయని, అవి స్వయంగా తానే తయారు చేస్తానని అల్ జెన్జి చెప్పింది. ఎలా తయారు చేస్తావు? అన్న ప్రశ్నకు, అది సీక్రెట్ అని సమాధానమిచ్చిందామె. ఎలాంటి కెమికల్స్ లేకుండా సహజసిద్ధమైన పద్ధతుల్లో వాటిని తయారు చేస్తానని వివరించింది అల్ జెన్జి. తన ఆంటీ ఓ చిన్న ఐడియా తనకు ఇచ్చిందనీ, మిగతాదంతా తన ఆలోచనతోనే చేశానని అల్ జెన్జి ఎబబీతీష్ట్రబీస్త్రసతీ.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







