100వ ఎ380 ఎయిర్క్రాఫ్ట్కి ఎమిరేట్స్ స్వాగతం
- November 03, 2017శుక్రవారం ఎయిర్బస్ ఎ-380 వందవ విమానం డెలివరీ సందర్భంగా ఎమిరేట్స్ ప్రత్యేకంగా వేడుకల్ని నిర్వహించింది. యూఏఈ తొలి ప్రధాని, ఫాదర్ ఆఫ్ నేషన్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్కి ట్రిబ్యూట్గా ఈ 100వ విమానాన్ని డెలివరీ చేశారు. హంబర్గ్లోని డెలివరీ సెంటర్లోనూ ప్రత్యేకంగా వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ఎయిర్బస్ డెలివరీ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ డిస్కషన్లో ఎమిరేట్స్ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్ మాట్లాడుతూ, ఎ-380 100వ విమానంపై ఫొటోకి సంబంధించి యూఏఈ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అలాగే దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సెలక్ట్ చేశారని అన్నారు. 2018వ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ జాయెద్గా ఇప్పటికే ప్రకటించారు. 2018లో జాయెద్ 100వ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఎ-380 అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన విమానం. ఈ విమాన ప్రయాణం ప్రయాణీకులకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్