100వ ఎ380 ఎయిర్క్రాఫ్ట్కి ఎమిరేట్స్ స్వాగతం
- November 03, 2017
శుక్రవారం ఎయిర్బస్ ఎ-380 వందవ విమానం డెలివరీ సందర్భంగా ఎమిరేట్స్ ప్రత్యేకంగా వేడుకల్ని నిర్వహించింది. యూఏఈ తొలి ప్రధాని, ఫాదర్ ఆఫ్ నేషన్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్కి ట్రిబ్యూట్గా ఈ 100వ విమానాన్ని డెలివరీ చేశారు. హంబర్గ్లోని డెలివరీ సెంటర్లోనూ ప్రత్యేకంగా వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ఎయిర్బస్ డెలివరీ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ డిస్కషన్లో ఎమిరేట్స్ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్ మాట్లాడుతూ, ఎ-380 100వ విమానంపై ఫొటోకి సంబంధించి యూఏఈ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అలాగే దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సెలక్ట్ చేశారని అన్నారు. 2018వ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ జాయెద్గా ఇప్పటికే ప్రకటించారు. 2018లో జాయెద్ 100వ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఎ-380 అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన విమానం. ఈ విమాన ప్రయాణం ప్రయాణీకులకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









