100వ ఎ380 ఎయిర్క్రాఫ్ట్కి ఎమిరేట్స్ స్వాగతం
- November 03, 2017
శుక్రవారం ఎయిర్బస్ ఎ-380 వందవ విమానం డెలివరీ సందర్భంగా ఎమిరేట్స్ ప్రత్యేకంగా వేడుకల్ని నిర్వహించింది. యూఏఈ తొలి ప్రధాని, ఫాదర్ ఆఫ్ నేషన్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్కి ట్రిబ్యూట్గా ఈ 100వ విమానాన్ని డెలివరీ చేశారు. హంబర్గ్లోని డెలివరీ సెంటర్లోనూ ప్రత్యేకంగా వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ఎయిర్బస్ డెలివరీ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ డిస్కషన్లో ఎమిరేట్స్ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్ మాట్లాడుతూ, ఎ-380 100వ విమానంపై ఫొటోకి సంబంధించి యూఏఈ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అలాగే దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సెలక్ట్ చేశారని అన్నారు. 2018వ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ జాయెద్గా ఇప్పటికే ప్రకటించారు. 2018లో జాయెద్ 100వ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఎ-380 అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన విమానం. ఈ విమాన ప్రయాణం ప్రయాణీకులకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









