పాటల చిత్రీకరణ కోసం యూరప్‌ వెళ్లిన పవన్‌కల్యాణ్‌25

- November 04, 2017 , by Maagulf
పాటల చిత్రీకరణ కోసం యూరప్‌ వెళ్లిన పవన్‌కల్యాణ్‌25

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్లో ఓ నూతన చిత్రం రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. కీర్తిసురేశ్‌, అను ఇమ్మాన్యుయెల్‌ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాటల చిత్రీకరణ కోసం చిత్ర బృందం ఇటీవలే యూరప్‌ వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ పవన్‌, త్రివిక్రమ్‌తో కలిసి దిగిన సెల్ఫీను అను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. 'గుడ్‌ కంపెనీ.. గుడ్‌ వర్క్‌' అని రాశారు. పవన్‌ స్టైల్‌గా కప్‌ పట్టుకుని ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నెలాఖరుకు సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. పవన్‌ 25వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. నవంబరు 7న త్రివిక్రమ్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. డిసెంబరులో పాటల్ని, జనవరి 10న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్‌ ఇందులో ఐటీ నిపుణుడి పాత్రలో కనిపించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com