టెక్సాస్‌ సదర్‌ల్యాండ్‌ స్ర్పింగ్స్‌లోని ఫస్ట్‌ బాప్టిస్ట్‌ చర్చిలో కాల్పుల మోత...27 మంది మృతి

- November 05, 2017 , by Maagulf
టెక్సాస్‌ సదర్‌ల్యాండ్‌ స్ర్పింగ్స్‌లోని ఫస్ట్‌ బాప్టిస్ట్‌ చర్చిలో కాల్పుల మోత...27 మంది మృతి

24 మందికి గాయాలు
అమెరికాలో మళ్లీ దారుణం
మృతుల్లో రెండేళ్ల చిన్నారి
హంతకుడి కాల్చివేత
టెక్సాస్‌: అమెరికాలో మరో ఉన్మాది విరుచుకుపడ్డాడు. ఆదివారం ఉదయం చర్చిలో విచ్చలవిడిగా కాల్పులు జరిపి 27 మంది అమాయకుల్ని పొట్టన బెట్టుకున్నాడు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. మరో 24 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు ఈ కాల్పులు జరిగాయి. హంతకుడిని పోలీసులు కాల్చిచంపారు. టెక్సా్‌సలోని సదర్‌ల్యాండ్‌ స్ర్పింగ్స్‌లోని ఫస్ట్‌ బాప్టిస్ట్‌ చర్చిలో దారుణం జరిగింది. ఘటన జరిగినపుడు చర్చిలో 50-60 మంది ఉన్నారు. హంతకుడు గన్‌ను పలుమార్లు లోడ్‌ చేసినట్లు తెలుస్తోంది. కాల్పుల అనంతరం వాహనంలో పారిపోతూ మరో వాహనాన్ని ఢీకొన్నాడు. దిగిపారిపోతూ ఉంటే పోలీసులు కాల్చిచంపేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com