టెక్సాస్ సదర్ల్యాండ్ స్ర్పింగ్స్లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో కాల్పుల మోత...27 మంది మృతి
- November 05, 2017
24 మందికి గాయాలు
అమెరికాలో మళ్లీ దారుణం
మృతుల్లో రెండేళ్ల చిన్నారి
హంతకుడి కాల్చివేత
టెక్సాస్: అమెరికాలో మరో ఉన్మాది విరుచుకుపడ్డాడు. ఆదివారం ఉదయం చర్చిలో విచ్చలవిడిగా కాల్పులు జరిపి 27 మంది అమాయకుల్ని పొట్టన బెట్టుకున్నాడు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. మరో 24 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు ఈ కాల్పులు జరిగాయి. హంతకుడిని పోలీసులు కాల్చిచంపారు. టెక్సా్సలోని సదర్ల్యాండ్ స్ర్పింగ్స్లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో దారుణం జరిగింది. ఘటన జరిగినపుడు చర్చిలో 50-60 మంది ఉన్నారు. హంతకుడు గన్ను పలుమార్లు లోడ్ చేసినట్లు తెలుస్తోంది. కాల్పుల అనంతరం వాహనంలో పారిపోతూ మరో వాహనాన్ని ఢీకొన్నాడు. దిగిపారిపోతూ ఉంటే పోలీసులు కాల్చిచంపేశారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







