సన్నబడాలనుకుంటే.. బ్రౌన్బ్రెడ్ శాండ్విచ్ తీసుకోండి..
- November 05, 2017
సన్నబడాలనుకునేవారు తినే పదార్థాల్లో కొవ్వు లేకుండా చూసుకోవాలి. మొలకలూ, పండ్లూ, డ్రైఫ్రూట్స్, బ్రౌన్బ్రెడ్ శాండ్విచ్ వంటివి ఎంచుకోవడం మంచిది. ఆఫీసుల్లో గంటలపాటు కూర్చుని పనిచేసేవారు తరచూ వీటిని డైట్లో చేర్చుకోవాలి. అలాగే మేలుచేసే కొవ్వు పదార్థాలను ఎంచుకునే ప్రయత్నం చేయాలి. అంటే బాదం, వాల్నట్లూ, పిస్తా వంటి డ్రైఫ్రూట్లూ, రైస్బ్రాన్ నూనె వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.
పొద్దున్నే అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. అందులోనూ మాంసకృత్తులూ, పీచూ, సంక్లిష్ట పిండిపదార్థాలున్నవి ఎంచుకుంటే మంచిది. మధ్యాహ్నం భోజనం తక్కువ తీసుకున్నవారవుతారు. గుడ్లూ, పప్పుధాన్యాలూ, అవిసెగింజలు, చేపలు వంటివాటితో పాటు కూరగాయలూ, ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలి.
బరువు పెరిగేందుకు పిండిపదార్థాలు గ్లూకోజ్గా మారడమే. ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే సాధారణ బియ్యానికి బదులు ముతక బియ్యం, రాగులూ, కొర్రలూ, జొన్నల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. వాటికి జతగా కూరగాయలూ, ఆకుకూరల్ని ఎంచుకుంటే పోషకాలు అందుతాయి. శరీర జీవక్రియా రేటు మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









