ప్రాన్స్ మంచూరియా
- November 06, 2017
కావలసిన పదార్థాలు: (శుభ్రం చేసిన) పచ్చిరొయ్యలు - 300 గ్రా., ఉల్లితరుగు - 1 కప్పు, మైదా - 1 టేబుల్ స్పూను, కార్న్ఫ్లోర్ - 4 టేబుల్ స్పూన్లు, అల్లం, వెలుల్లి తరుగు - 1 టీ స్పూను చొప్పున, వెల్లుల్లి పేస్టు - 2 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, అజినమోటో - చిటికెడు, టమోటా, చిల్లీ, సోయా సాస్లు + వెనిగర్ - 2 టేబుల్ స్పూన్ల చొప్పున, మిరియాల పొడి - అర టీ స్పూను, ఉల్లికాడల తరుగు - 2 టేబుల్ స్పూన్లు, క్యాప్సికం - 1, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం : రొయ్యలను మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూను అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూను సోయా సాస్, ఉప్పులతో కలిపి గంటసేపు పక్కనుంచి నూనెలో దోరగా వేగించాలి. కొద్ది నూనెలో వెల్లుల్లి, ఉల్లి తరుగు, ఉల్లి కాడలు, క్యాప్సికం తరుగు, అజినమోటో, వెనీగర్, ఉప్పు వేసి 2 నిమిషాలు వేగించాలి. రొయ్యలు, సోయా సాస్, చిల్లీ సాస్, టమోటా సాస్ కూడా వేసి కరిగించిన కార్న్ఫ్లోర్ చల్లాలి. చివర్లో మిరియాల పొడి చల్లి దించేయాలి.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి