ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్లోని దాడి మా పనే: ఐసిస్
- November 07, 2017
ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్లోని ఓ టెలివిజన్ ఛానెల్పై దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. స్థానిక షంషాద్ టీవీ ఛానల్ భవనంలోకి చొరబడ్డ కొందరు దుండగులు అక్కడి ఉద్యోగులపై బాంబులు విసురుతూ కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. రెండు గంటల పాటు దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.
'పోలీసుల దుస్తుల్లో వచ్చిన దుండగులు సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపి లోపలికి చొరబడ్డారు. గ్రనేడ్లు విసురుతూ కాల్పులు జరిపారు. కొద్ది మందికి తూటాలు తగిలాయి. చాలా మంది ఉద్యోగులు తప్పించుకొని వేరే అంతస్తులోకి పారిపోయారు' అని అక్కడ ఉద్యోగం చేసే అబెద్ ఎషాస్ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు టెలివిజన్ కార్యాలయ భవనం గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని మట్టుబెట్టారు.
మరొక దుండగుడిని భవనం వెలుపలే కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో టెలివిజన్ ప్రసారాలను తాత్కాలికంగా నిలిపివేశారు. రెండు గంటల తర్వాత వాటిని పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







