ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- June 28, 2026
మనామా: బహ్రెయిన్లో తీవ్రమైన వేసవి ఎండల నుండి కార్మికులను రక్షించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా, 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' ప్రచారం రెండవ వారం గలాలిలోని ఒక కంపెనీలో జరిగింది.ఈ కార్యక్రమానికి ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్–ICRF బహ్రెయిన్ అధ్యక్షత వహిస్తోంది.ఇది కార్మికుల భద్రత మరియు హైడ్రేషన్ను ప్రోత్సహించడంపై దృష్టి సారించిన తన వార్షిక సమ్మర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA), మరియు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) మద్దతు ఇస్తున్నాయి.
గలాలిలోని మహమ్మద్ జలాల్ కాంట్రాక్టింగ్ కంపెనీలో ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ సుమారు 200 మంది కార్మికులకు వాటర్, జ్యూస్, లాబన్, ఆరేంజ్, ఆపిల్, అరటిపండ్లు వంటి తాజా పండ్లను అందించారు. సమ్మర్ లో తీసుకోవల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీఆర్ఎఫ్ ఛైర్మన్ అడ్వకేట్ వి. కె. థామస్, జాయింట్ సెక్రటరీ సురేష్ బాబు, సలహాదారు అరుల్దాస్ థామస్, థర్స్ట్ క్వెంచర్స్ కోఆర్డినేటర్ చెంబన్ జలాల్, ఇతర ఐసీఆర్ఎఫ్ అధికారులతో పాటు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







