జపాన్లో పురుషులతో శృంగారం జరిపి హత్యలు చేయడం
- November 07, 2017
జపాన్లో సంచలనం సృష్టంచిన బ్లాక్ విడో కేసులో చిసాకో కాకేహి (70)కి మరణదండన విధిస్తూ క్యోటో జిల్లా న్యాయస్థానం మంగళవారం ఉదయం తీర్పు వెలువరించింది.
జపాన్ లో సంచలనం సృష్టించిన 'బ్లాక్ విడో' కేసులో ఈ ఉదయం కోర్టు తీర్పు వెలువడింది. తన భర్తను, ఇద్దరు ప్రియుళ్లను దారుణాతి దారుణంగా హత్య చేసిందని చిసాకో కాకేహిపై ఆరోపణలున్నాయి.
మగవాళ్లను ఆకర్షించి, ఆపై వారితో శృంగారం జరిపి హత్యలు చేయడం కాకేహి దినచర్య. ఈ వ్యవహారం బయటకు పొక్కిన తరువాత జపాన్ లో కలకలం రేగింది. డేటింగ్ ఏజన్సీలు, ఇతర వెబ్ సైట్ల ద్వారా తనకన్నా పెద్దవాళ్లను, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, పిల్లలు లేని ఒంటరి వాళ్లను ఎంచుకుని, వారితో పరిచయం పెంచుకుంటుంది చిసాకో కాకేహీ.
జీవిత బీమా పాలసీలు చేయించి, నామినీగా తన పేరును రాయించుకుని, ఆపై వారిని హతమార్చేది. హత్యలు చేసేందుకు పదేళ్ల వ్యవధిలో బిలియన్ యన్ లు వెచ్చించి సైనైడ్ ను కూడా కొనుగోలు చేసింది. తొలుత కోర్టులో నేరాన్ని కాకేహి ఒప్పుకోలేదు. చివరికి తప్పును ఒప్పుకుని తన నాలుగో భర్తను హత్య చేసిన విషయంతో ప్రారంభించి మొత్తం తాను చేసిన హత్యలను ఒప్పుకొంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..







