ఇరాన్పై ప్రభావం చూపని ట్రంప్ నిషేధం: డబ్ల్యుటిఎం పర్యాటక మేనేజర్
- November 07, 2017
ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన నిషేధం వల్ల ఇరాన్పై ఎలాంటి ప్రభావం లేదని వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యుటిఎం)లో ఇరాన్ పర్యాటక మేనేజర్ తెలిపారు. ఇరాన్ పట్ల ఆసక్తి వున్నవారు ట్రంప్ వ్యాఖ్యలపై అస్సలు దృష్టి పెట్టడం లేదని అన్నారు. ప్రపంచమంతా పర్యటించేవారు ఇరాన్లో కూడా పర్యటించా లను కుంటున్నారని, అలాగే వస్తున్నారని పర్యాటక మేనేజర్ ఇబ్రహీం పౌర్ఫారాజ్ తెలిపారు. ఇరాన్లో పర్యాటకరంగం అభివృద్ధి చెందుతోందని, ఇరాన్లో పర్యటిస్తే ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయనే విషయంలో పర్యాటకులు ఎవరూ కూడా ఆందోళన చెందడం లేదని అన్నారు. ఇరాన్కు వచ్చే ముందు విదేశీ పర్యాటకుల కీలకమైన ఆందో ళన భద్రత గురించేనని, ఒక్కసారి ఇరాన్ లోకి ప్రవేశిస్తే పరిస్థితి వేరుగా వుంటుందని చెప్పారు. కొద్ది రోజులు వుండాలని వచ్చిన వారు పర్యటనను పొడిగించే పరిస్థితులు కూడా వున్నాయని అన్నారు. 40శాతం పర్యాటక కంపెనీలు అమెరికాతో సం బంధాల పట్ల ఆసక్తి కనపరచడం లేదని తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









