'నిర్భయ్' క్షిపణి విజయవంతం
- November 07, 2017
సుదీర్ఘ దూరం ప్రయాణించే నిర్భయ్ క్షిపణిని భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. 300 కేజీల వార్హెడ్స్ను మోసుకుపోగల ఈ క్షిపణిని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఒడిశా తీరం చాందీపూర్లోని కాంప్లెక్-3 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఉదయం 11.20కి దీన్ని పరీక్షించినట్టు డిఆర్డివో అధికారులు వెల్లడించారు. సబ్ సోనిక్ మిసైల్ క్యాటగిరీ కింద 2013లోనే క్షిపణిని రూపొందించి, ఇప్పటికే నాలుగుసార్లు పరీక్షించారు. అయితే, నాలుగింట ఒక్కసారే క్షిపణి పరీక్ష విజయవంతమైంది. తాజాగా మంగళవారం జరిపిన పరీక్ష విజయవంతమైందని డిఆర్డివో అధికారులు ఆనందంతో వెల్లడించారు. ఆడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబరేటరీ ప్రత్యేకంగా రూపొందించిన సాలిడ్ రాకెట్ మోటార్ బూస్టర్ను నిర్భయ్ పరీక్ష కోసం వాడినట్టు చెప్పారు. వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించగల ఈ క్షిపణి శబ్ధవేగం కంటే కాస్త తక్కువ వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. టర్భోజెట్ ఇంజన్తో పని చేసే నిర్భయ్, నావిగేషన్ విధానంలో లక్ష్యాన్ని ఖచ్చితంగా చేధించేలా ఆర్సిఐ (ఇమారత్ రీసెర్చ్ సెంటర్) శాస్తవ్రేత్తలు రూపొందించారని డిఆర్డివో అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









