'నిర్భయ్' క్షిపణి విజయవంతం
- November 07, 2017
సుదీర్ఘ దూరం ప్రయాణించే నిర్భయ్ క్షిపణిని భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. 300 కేజీల వార్హెడ్స్ను మోసుకుపోగల ఈ క్షిపణిని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఒడిశా తీరం చాందీపూర్లోని కాంప్లెక్-3 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఉదయం 11.20కి దీన్ని పరీక్షించినట్టు డిఆర్డివో అధికారులు వెల్లడించారు. సబ్ సోనిక్ మిసైల్ క్యాటగిరీ కింద 2013లోనే క్షిపణిని రూపొందించి, ఇప్పటికే నాలుగుసార్లు పరీక్షించారు. అయితే, నాలుగింట ఒక్కసారే క్షిపణి పరీక్ష విజయవంతమైంది. తాజాగా మంగళవారం జరిపిన పరీక్ష విజయవంతమైందని డిఆర్డివో అధికారులు ఆనందంతో వెల్లడించారు. ఆడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబరేటరీ ప్రత్యేకంగా రూపొందించిన సాలిడ్ రాకెట్ మోటార్ బూస్టర్ను నిర్భయ్ పరీక్ష కోసం వాడినట్టు చెప్పారు. వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించగల ఈ క్షిపణి శబ్ధవేగం కంటే కాస్త తక్కువ వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. టర్భోజెట్ ఇంజన్తో పని చేసే నిర్భయ్, నావిగేషన్ విధానంలో లక్ష్యాన్ని ఖచ్చితంగా చేధించేలా ఆర్సిఐ (ఇమారత్ రీసెర్చ్ సెంటర్) శాస్తవ్రేత్తలు రూపొందించారని డిఆర్డివో అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!







