ఖసబ్లో తొలి యాంఫిబియస్ టూరిస్ట్ బస్ ప్రారంభం
- November 08, 2017
ఖసబ్లో పర్యటించే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు యాంఫిబియస్ బస్ సర్వీస్ని ప్రారంభించారు. గోల్డెన్ కోస్ట్ ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీ ఈ బస్ని ప్రారంభించింది. తొలిసారిగా ఈ సర్వీస్ పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. గోల్డెన్ కోస్ట్ ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీ జిఎం అబ్దుల్ రెహ్మాన్ అహ్మద్ అల్ముల్లా మాట్లాడుతూ, యూరోప్ నుంచి ఈ బస్ని ఇంపోర్ట్ చేశామని అక్టోబర్ 30 నుంచి ఇది అందుబాటులోకి వచ్చిందని అన్నారు. 90 నిమిషాలపాటు ఈ బస్ ప్రయాణం ఉంటుంది. ఈ బస్ నేల మీదా, సముద్రంలోనూ ప్రయాణిస్తుంది. 34 సీట్లు కెపాసిటీతో ఉండే ఈ బస్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో రోడ్డుపైనా, నీటిలో 7 నాట్స్ వేగంతోనూ ప్రయాణించగలదు. పెద్దలకు 10 ఒమన్ రియాల్స్, పిల్లలకు 5 ఒమన్ రియాల్స్ ఛార్జ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. లైఫ్ జాకెట్స్, మెడికల్ ఎక్విప్మెంట్, క్వాలిఫైడ్ టెక్నికల్ స్టాఫ్ ఈ బస్లో అందుబాటులో ఉంటారు. ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చెయ్యడానికి రెండేళ్ళు పట్టింది.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







