ఖసబ్లో తొలి యాంఫిబియస్ టూరిస్ట్ బస్ ప్రారంభం
- November 08, 2017
ఖసబ్లో పర్యటించే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు యాంఫిబియస్ బస్ సర్వీస్ని ప్రారంభించారు. గోల్డెన్ కోస్ట్ ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీ ఈ బస్ని ప్రారంభించింది. తొలిసారిగా ఈ సర్వీస్ పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. గోల్డెన్ కోస్ట్ ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీ జిఎం అబ్దుల్ రెహ్మాన్ అహ్మద్ అల్ముల్లా మాట్లాడుతూ, యూరోప్ నుంచి ఈ బస్ని ఇంపోర్ట్ చేశామని అక్టోబర్ 30 నుంచి ఇది అందుబాటులోకి వచ్చిందని అన్నారు. 90 నిమిషాలపాటు ఈ బస్ ప్రయాణం ఉంటుంది. ఈ బస్ నేల మీదా, సముద్రంలోనూ ప్రయాణిస్తుంది. 34 సీట్లు కెపాసిటీతో ఉండే ఈ బస్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో రోడ్డుపైనా, నీటిలో 7 నాట్స్ వేగంతోనూ ప్రయాణించగలదు. పెద్దలకు 10 ఒమన్ రియాల్స్, పిల్లలకు 5 ఒమన్ రియాల్స్ ఛార్జ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. లైఫ్ జాకెట్స్, మెడికల్ ఎక్విప్మెంట్, క్వాలిఫైడ్ టెక్నికల్ స్టాఫ్ ఈ బస్లో అందుబాటులో ఉంటారు. ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చెయ్యడానికి రెండేళ్ళు పట్టింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









