ఖసబ్‌లో తొలి యాంఫిబియస్‌ టూరిస్ట్‌ బస్‌ ప్రారంభం

- November 08, 2017 , by Maagulf
ఖసబ్‌లో తొలి యాంఫిబియస్‌ టూరిస్ట్‌ బస్‌ ప్రారంభం

ఖసబ్‌లో పర్యటించే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు యాంఫిబియస్‌ బస్‌ సర్వీస్‌ని ప్రారంభించారు. గోల్డెన్‌ కోస్ట్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం కంపెనీ ఈ బస్‌ని ప్రారంభించింది. తొలిసారిగా ఈ సర్వీస్‌ పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. గోల్డెన్‌ కోస్ట్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం కంపెనీ జిఎం అబ్దుల్‌ రెహ్మాన్‌ అహ్మద్‌ అల్‌ముల్లా మాట్లాడుతూ, యూరోప్‌ నుంచి ఈ బస్‌ని ఇంపోర్ట్‌ చేశామని అక్టోబర్‌ 30 నుంచి ఇది అందుబాటులోకి వచ్చిందని అన్నారు. 90 నిమిషాలపాటు ఈ బస్‌ ప్రయాణం ఉంటుంది. ఈ బస్‌ నేల మీదా, సముద్రంలోనూ ప్రయాణిస్తుంది. 34 సీట్లు కెపాసిటీతో ఉండే ఈ బస్‌ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో రోడ్డుపైనా, నీటిలో 7 నాట్స్‌ వేగంతోనూ ప్రయాణించగలదు. పెద్దలకు 10 ఒమన్‌ రియాల్స్‌, పిల్లలకు 5 ఒమన్‌ రియాల్స్‌ ఛార్జ్‌ చేస్తున్నామని ఆయన చెప్పారు. లైఫ్‌ జాకెట్స్‌, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌, క్వాలిఫైడ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ ఈ బస్‌లో అందుబాటులో ఉంటారు. ఈ ప్రాజెక్ట్‌ని ఇంప్లిమెంట్‌ చెయ్యడానికి రెండేళ్ళు పట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com