బియ్యం పాయసం
- November 08, 2017
కావలసినవి : బియ్యం - పావు కప్పు, పాలు - రెండున్నర కప్పులు, యాలకులు - 2, కిస్మిస్ - 25 గ్రాములు, కుంకుమపువ్వు- చిటికెడు, అలంకరణకు 3 వెండి రేకలు (ఫాయిల్స్)
తయారుచేసే విధానం
బియ్యాన్ని ముందుగా పావుగంట నానబెట్టి పొడిగా ఆరబెట్టాలి. తర్వాత మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దళసరి అడుగున్న పాత్రలో పాలు మరుగుతున్నప్పుడు బియ్యపు రవ్వను, యాలకుల పొడిని వేసి, రవ్వ మెత్తబడేదాకా సన్నని సెగపైన ఉడికించాలి. పాయసం అడుగంటకుండా తిప్పుతూ పాలు చిక్కబడ్డాక దింపేయాలి. కొద్ది వేడి పాలల్లో కాసేపు నానబెట్టిన కుంకుమపువ్వుని పాయసంలో కలపాలి. చివర్లో పంచదార వేసి 3 నిమిషాలు ఉంచి దించేయాలి. వెండిరేకలతో అలంకరించి తింటే పాయసం రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









