బియ్యం పాయసం
- November 08, 2017
కావలసినవి : బియ్యం - పావు కప్పు, పాలు - రెండున్నర కప్పులు, యాలకులు - 2, కిస్మిస్ - 25 గ్రాములు, కుంకుమపువ్వు- చిటికెడు, అలంకరణకు 3 వెండి రేకలు (ఫాయిల్స్)
తయారుచేసే విధానం
బియ్యాన్ని ముందుగా పావుగంట నానబెట్టి పొడిగా ఆరబెట్టాలి. తర్వాత మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దళసరి అడుగున్న పాత్రలో పాలు మరుగుతున్నప్పుడు బియ్యపు రవ్వను, యాలకుల పొడిని వేసి, రవ్వ మెత్తబడేదాకా సన్నని సెగపైన ఉడికించాలి. పాయసం అడుగంటకుండా తిప్పుతూ పాలు చిక్కబడ్డాక దింపేయాలి. కొద్ది వేడి పాలల్లో కాసేపు నానబెట్టిన కుంకుమపువ్వుని పాయసంలో కలపాలి. చివర్లో పంచదార వేసి 3 నిమిషాలు ఉంచి దించేయాలి. వెండిరేకలతో అలంకరించి తింటే పాయసం రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









