బియ్యం పాయసం

- November 08, 2017 , by Maagulf
బియ్యం పాయసం

కావలసినవి : బియ్యం - పావు కప్పు, పాలు - రెండున్నర కప్పులు, యాలకులు - 2, కిస్‌మిస్‌ - 25 గ్రాములు, కుంకుమపువ్వు- చిటికెడు, అలంకరణకు 3 వెండి రేకలు (ఫాయిల్స్‌)
తయారుచేసే విధానం
బియ్యాన్ని ముందుగా పావుగంట నానబెట్టి పొడిగా ఆరబెట్టాలి. తర్వాత మిక్సీలో బరకగా గ్రైండ్‌ చేసుకోవాలి. దళసరి అడుగున్న పాత్రలో పాలు మరుగుతున్నప్పుడు బియ్యపు రవ్వను, యాలకుల పొడిని వేసి, రవ్వ మెత్తబడేదాకా సన్నని సెగపైన ఉడికించాలి. పాయసం అడుగంటకుండా తిప్పుతూ పాలు చిక్కబడ్డాక దింపేయాలి. కొద్ది వేడి పాలల్లో కాసేపు నానబెట్టిన కుంకుమపువ్వుని పాయసంలో కలపాలి. చివర్లో పంచదార వేసి 3 నిమిషాలు ఉంచి దించేయాలి. వెండిరేకలతో అలంకరించి తింటే పాయసం రుచిగా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com