106 మంది హత్య.. జర్మనీలో నర్సు దారుణం
- November 10, 2017
వృత్తిపరంగా విసిగిపోయిన ఓ జర్మన్ నర్సు దారుణానికి ఒడిగట్టింది. తన అసనహమంతా రోగులపై ప్రదర్శించింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 106మంది రోగులను ఆమె బలితీసుకుంది.
నిజానికి ఇద్దరు రోగులపై హత్యాయత్నం కేసులోనే తొలుత ఆమెను అరెస్టు చేసినప్పటికీ ఆ తర్వాత అసలు విషయాలు బయటపడ్డాయి. జర్మనీలోని డెల్మెన్ హోస్ట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోన్న ఆమె పేరు నీల్స్ హోగెల్(41).
2015లో ఓ ఇద్దరు రోగులపై హత్యాయత్నానికి పాల్పడి, మరో ఇద్దర్ని హతమార్చిందన్న కేసులో హోగెల్ అరెస్టు అయింది. దర్యాప్తులో 'వైద్య సేవ పట్ల విసుగు చెందడం వల్లే ఈ పని చేశాను' అని నర్సు అంగీకరించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఆమె మరో 90మందిని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.
దీంతో న్యాయస్థానం ఆమెకు జీవిత ఖైదు విధించింది. అయితే ఇంతలోనే మరికొంతమంది బాధితులు మరోసారి కేసును దర్యాప్తు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో మరో 16మందిని కూడా హోగెల్ పొట్టనబెట్టుకున్నట్టు తేలింది. మొత్తం మీద 1999-2005మధ్య కాలంలో 105మందిని హోగెల్ హతమార్చినట్టు గుర్తించారు.
2005లో ఓ రోగికి ప్రాణాంతక ఇంజెక్షన్ చేస్తున్న సమయంలో మరో నర్సు గుర్తించింది. ఆమె ఫిర్యాదుతో హోగెల్ హత్యాకాండలు వెలుగుచూశాయి.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







