మగధీరుని గుర్రపు స్వారీ
- November 12, 2017
హైదరాబాద్: కథానాయకుడు రామ్చరణ్కి గుర్రాలు, శునకాలంటే చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా వాటితో ఆడుకుంటుంటారు. ఇలా అనేక సందర్భాల్లో తీసిన ఫొటోలు, వీడియోలను రామ్చరణ్ సతీమణి ఉపాసన సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఆమె మరో వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
అందులో రామ్చరణ్ నల్లగుర్రాన్ని స్వారీ చేస్తూ కనిపించారు. 'మగధీర' సినిమాలో రామ్చరణ్ ఓ గుర్రంపై సందడి చేశారు గుర్తుందా. ఇప్పుడు ఆయన సవారీ చేసిన గుర్రం కూడా అదేనట. ఈ విషయాన్ని ఉపాసన తెలిపారు. 'మిస్టర్ సి (చరణ్) వీకెండ్ను తన పాత స్నేహితుడు 'మగధీర' గుర్రంతో గడుపుతున్నారు' అని ఉపాసన ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు.
రామ్చరణ్ ప్రస్తుతం 'రంగస్థలం 1985' చిత్రంలో నటిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సమంత కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. జగపతిబాబు, అనసూయ, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







