జపాన్ ప్రధానితో నరేంద్రమోదీ భేటీ
- November 14, 2017
ఫిలిప్పీన్స్లో మూడో రోజు పర్యటనలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీరికలేకుండా గడుపుతున్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాధినేతలతో ఆయన సమావేశమయ్యారు. మంగళవారం ప్రధాని మోదీ జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు పలు ద్వైపాక్షిక అంశాల గురించి చర్చించారు. గ్లోబల్ పార్టనర్షిప్పై ఇరు దేశాధినేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఆయన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్ టర్నబుల్తో భేటీ అయ్యారు.
వాళ్లతో పాటు బ్రూనే సుల్తాన్ హస్సనల్ బోల్కై, న్యూజిలాండ్ ప్రధాని జసిడా ఆండ్రేన్ను మోదీ కలిశారు. ఆగ్నేయాసియా దేశా సంఘం(ఆసియాన్) స్వర్ణోత్సవాల నిమిత్తం మోదీ ఆదివారం ఫిలిప్పీన్స్ వెళ్లిన విషయం తెలిసిందే. సోమవారం ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై మోదీ ట్రంప్తో చర్చించారు. వీరిద్దరి భేటీపై శ్వేతసౌధం స్పందించింది.
ట్రంప్ అధ్యక్షతన భారత్తో బంధాలు మరింత బలోపేతం కానున్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







