ట్రావెల్‌ ఏజెన్సీలో దొంగతనం: 12 మందికి ట్రయల్‌

- November 14, 2017 , by Maagulf
ట్రావెల్‌ ఏజెన్సీలో దొంగతనం: 12 మందికి ట్రయల్‌

12 మంది సభ్యులు గల ముఠాని దొంగతనం కేసులో ట్రయల్‌ ముందుంచారు. కత్తులతో బెదిరించి, ట్రావెల్‌ ఆఫీసులో 14,000 దిర్హామ్‌లు దొంగిలించిన కేసులో వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. ఆసియాకి చెందిన వ్యక్తులు మొహానికి మాస్కులు ధరించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సాక్ష్యాధారాలతో సహా పోలీసులు గుర్తించారు. కొన్ని నెలల క్రితం ముసాఫ్ఫాలోని ఓ ట్రావెల్‌ ఆఫీసుపై దాడి చేసింది ఈ దొంగల ముఠా. దొంగతనంపై ఆ సంస్థ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 12 మందిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి కొంత నగదు, అలాగే కొన్ని మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే నిందితులు తమపై వచ్చిన ఆరోపణల్ని ఖండిస్తున్నారు. తదుపరి విచారణ డిసెంబర్‌కి వాయిదా పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com