దుబాయ్‌ పార్కుల్లో వీరికి ఉచిత ప్రవేశం

- November 14, 2017 , by Maagulf
దుబాయ్‌ పార్కుల్లో వీరికి ఉచిత ప్రవేశం

పీపుల్‌ ఆఫ్‌ డిటర్మినేషన్‌ కోసం దుబాయ్‌ మునిసిపాలిటీ పార్కుల్లోకి ఉచిత ఎంట్రీ సౌకర్యం కల్పిస్తోంది. 'పీపుల్‌ ఆఫ్‌ డిటర్మినేషన్‌'ని గౌరవించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్‌ మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి. దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌, అలాగే దుబాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ షేక్‌ హమదాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ ప్రారంభించిన 'మై కమ్యూనిటీ ఈజ్‌ ఎ ప్లేస్‌ ఫర్‌ ఆల్‌' ఇనీషియేటివ్‌లో భాగంగానూ 'పీపుల్‌ ఆఫ్‌ డిటర్మినేషన్‌'కి ఈ అరుదైన అవకాశం కల్పిస్తున్నారు. 2020 నాటికి దుబాయ్‌ని పీపుల్‌ ఆఫ్‌ డిటర్మినేషన్‌ ఫ్రెండ్లీ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అధికారులు తెలిపారు. పీపుల్‌ ఆఫ్‌ డిటర్మినేషన్‌కి సాయంగా వచ్చేవారికీ ఫీజు నుంచి మినహాయింపును ఇస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com