షేక్ జాయెద్ వంతెనపై నుంచి యువకుని ఆత్మహత్యయత్నాన్ని అడ్డుకొన్న అబుదాబి పోలీసులు
- November 14, 2017
జీవితం మీద ఏం విరక్తి పుట్టిందో తెలియదు కానీ... ఓ 22 ఏళ్ల ఎమిరాటీ యువకుడు సోమవారం ( నేడు) ఉదయం అబుదాబిలోని షేక్ జాయెద్ వంతెన పై నుంచి కిందకు దూకడం ద్వారా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ యువకుడిని ఆత్మహత్య యత్నం నుంచి విరమింపచేయడంలో అబుదాబి పోలీసులు సఫలీకృతులయ్యారు. ఆ వ్యక్తి వంతెన లోహపు స్తంభాలపై ఎగబాకి అంత ఎత్తు నుంచి కిందకు దహికి తన జీవితాన్ని అంతం చేయటానికి సిద్ధమయ్యాడు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకొని ఎమిరాటీ వ్యక్తితో మాట్లాడి దేవుడిచ్చిన జీవితం విలువ గూర్చి నచ్చచెప్పి తమ వంతుగా ఆ యువకుడు ఎదుర్కొంటున్న పరిస్థితులను కొంతమేరకు తమ వంతు బాధ్యతగా చక్కదిద్దుతామని మాట్లాడుతూ దయచేసి వంతెనను దిగిరావాల్సిందిగా ఎట్టకేలకు పోలీసులు ఒప్పించారు. అయితే మరోవైపు ఆ వ్యక్తి భద్రతను నిర్ధారించడానికి తగిన సురక్షిత చర్యలు చేపట్టారు. అబుదాబి పోలీస్ ఒక ప్రకటనలో వివరిస్తూ, ఆ యువకుడు మానసికంగా అస్థిరంగా ఉన్నాడని ఆ విధమైన పరిస్థితులలో వంతెనను అధిరోహించాడని వెల్లడించారు. తదుపరి చర్య కోసం అతన్ని సమీప పోలీసు స్టేషన్ కు తరలించారు. నేటి ఉదయం ఆ యువకుని కారణంగా షేక్ జాయెద్ వంతెనకు వెళ్లే రహదారులను తాత్కాలిక మూసివేతను ప్రకటించారు,పోలీసులు సమయస్ఫూర్తితో పరిస్థితిని పరిష్కరించారు. యువకుడిని కాపాడిన తర్వాత వంతెనపై ట్రాఫిక్ తిరిగి యధావిధంగా కొనసాగించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









