షేక్ జాయెద్ వంతెనపై నుంచి యువకుని ఆత్మహత్యయత్నాన్ని అడ్డుకొన్న అబుదాబి పోలీసులు
- November 14, 2017
జీవితం మీద ఏం విరక్తి పుట్టిందో తెలియదు కానీ... ఓ 22 ఏళ్ల ఎమిరాటీ యువకుడు సోమవారం ( నేడు) ఉదయం అబుదాబిలోని షేక్ జాయెద్ వంతెన పై నుంచి కిందకు దూకడం ద్వారా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ యువకుడిని ఆత్మహత్య యత్నం నుంచి విరమింపచేయడంలో అబుదాబి పోలీసులు సఫలీకృతులయ్యారు. ఆ వ్యక్తి వంతెన లోహపు స్తంభాలపై ఎగబాకి అంత ఎత్తు నుంచి కిందకు దహికి తన జీవితాన్ని అంతం చేయటానికి సిద్ధమయ్యాడు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకొని ఎమిరాటీ వ్యక్తితో మాట్లాడి దేవుడిచ్చిన జీవితం విలువ గూర్చి నచ్చచెప్పి తమ వంతుగా ఆ యువకుడు ఎదుర్కొంటున్న పరిస్థితులను కొంతమేరకు తమ వంతు బాధ్యతగా చక్కదిద్దుతామని మాట్లాడుతూ దయచేసి వంతెనను దిగిరావాల్సిందిగా ఎట్టకేలకు పోలీసులు ఒప్పించారు. అయితే మరోవైపు ఆ వ్యక్తి భద్రతను నిర్ధారించడానికి తగిన సురక్షిత చర్యలు చేపట్టారు. అబుదాబి పోలీస్ ఒక ప్రకటనలో వివరిస్తూ, ఆ యువకుడు మానసికంగా అస్థిరంగా ఉన్నాడని ఆ విధమైన పరిస్థితులలో వంతెనను అధిరోహించాడని వెల్లడించారు. తదుపరి చర్య కోసం అతన్ని సమీప పోలీసు స్టేషన్ కు తరలించారు. నేటి ఉదయం ఆ యువకుని కారణంగా షేక్ జాయెద్ వంతెనకు వెళ్లే రహదారులను తాత్కాలిక మూసివేతను ప్రకటించారు,పోలీసులు సమయస్ఫూర్తితో పరిస్థితిని పరిష్కరించారు. యువకుడిని కాపాడిన తర్వాత వంతెనపై ట్రాఫిక్ తిరిగి యధావిధంగా కొనసాగించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







