షేక్ జాయెద్ వంతెనపై నుంచి యువకుని ఆత్మహత్యయత్నాన్ని అడ్డుకొన్న అబుదాబి పోలీసులు
- November 14, 2017
జీవితం మీద ఏం విరక్తి పుట్టిందో తెలియదు కానీ... ఓ 22 ఏళ్ల ఎమిరాటీ యువకుడు సోమవారం ( నేడు) ఉదయం అబుదాబిలోని షేక్ జాయెద్ వంతెన పై నుంచి కిందకు దూకడం ద్వారా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ యువకుడిని ఆత్మహత్య యత్నం నుంచి విరమింపచేయడంలో అబుదాబి పోలీసులు సఫలీకృతులయ్యారు. ఆ వ్యక్తి వంతెన లోహపు స్తంభాలపై ఎగబాకి అంత ఎత్తు నుంచి కిందకు దహికి తన జీవితాన్ని అంతం చేయటానికి సిద్ధమయ్యాడు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకొని ఎమిరాటీ వ్యక్తితో మాట్లాడి దేవుడిచ్చిన జీవితం విలువ గూర్చి నచ్చచెప్పి తమ వంతుగా ఆ యువకుడు ఎదుర్కొంటున్న పరిస్థితులను కొంతమేరకు తమ వంతు బాధ్యతగా చక్కదిద్దుతామని మాట్లాడుతూ దయచేసి వంతెనను దిగిరావాల్సిందిగా ఎట్టకేలకు పోలీసులు ఒప్పించారు. అయితే మరోవైపు ఆ వ్యక్తి భద్రతను నిర్ధారించడానికి తగిన సురక్షిత చర్యలు చేపట్టారు. అబుదాబి పోలీస్ ఒక ప్రకటనలో వివరిస్తూ, ఆ యువకుడు మానసికంగా అస్థిరంగా ఉన్నాడని ఆ విధమైన పరిస్థితులలో వంతెనను అధిరోహించాడని వెల్లడించారు. తదుపరి చర్య కోసం అతన్ని సమీప పోలీసు స్టేషన్ కు తరలించారు. నేటి ఉదయం ఆ యువకుని కారణంగా షేక్ జాయెద్ వంతెనకు వెళ్లే రహదారులను తాత్కాలిక మూసివేతను ప్రకటించారు,పోలీసులు సమయస్ఫూర్తితో పరిస్థితిని పరిష్కరించారు. యువకుడిని కాపాడిన తర్వాత వంతెనపై ట్రాఫిక్ తిరిగి యధావిధంగా కొనసాగించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష