షేక్ జాయెద్ వంతెనపై నుంచి యువకుని ఆత్మహత్యయత్నాన్ని అడ్డుకొన్న అబుదాబి పోలీసులు
- November 14, 2017జీవితం మీద ఏం విరక్తి పుట్టిందో తెలియదు కానీ... ఓ 22 ఏళ్ల ఎమిరాటీ యువకుడు సోమవారం ( నేడు) ఉదయం అబుదాబిలోని షేక్ జాయెద్ వంతెన పై నుంచి కిందకు దూకడం ద్వారా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ యువకుడిని ఆత్మహత్య యత్నం నుంచి విరమింపచేయడంలో అబుదాబి పోలీసులు సఫలీకృతులయ్యారు. ఆ వ్యక్తి వంతెన లోహపు స్తంభాలపై ఎగబాకి అంత ఎత్తు నుంచి కిందకు దహికి తన జీవితాన్ని అంతం చేయటానికి సిద్ధమయ్యాడు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకొని ఎమిరాటీ వ్యక్తితో మాట్లాడి దేవుడిచ్చిన జీవితం విలువ గూర్చి నచ్చచెప్పి తమ వంతుగా ఆ యువకుడు ఎదుర్కొంటున్న పరిస్థితులను కొంతమేరకు తమ వంతు బాధ్యతగా చక్కదిద్దుతామని మాట్లాడుతూ దయచేసి వంతెనను దిగిరావాల్సిందిగా ఎట్టకేలకు పోలీసులు ఒప్పించారు. అయితే మరోవైపు ఆ వ్యక్తి భద్రతను నిర్ధారించడానికి తగిన సురక్షిత చర్యలు చేపట్టారు. అబుదాబి పోలీస్ ఒక ప్రకటనలో వివరిస్తూ, ఆ యువకుడు మానసికంగా అస్థిరంగా ఉన్నాడని ఆ విధమైన పరిస్థితులలో వంతెనను అధిరోహించాడని వెల్లడించారు. తదుపరి చర్య కోసం అతన్ని సమీప పోలీసు స్టేషన్ కు తరలించారు. నేటి ఉదయం ఆ యువకుని కారణంగా షేక్ జాయెద్ వంతెనకు వెళ్లే రహదారులను తాత్కాలిక మూసివేతను ప్రకటించారు,పోలీసులు సమయస్ఫూర్తితో పరిస్థితిని పరిష్కరించారు. యువకుడిని కాపాడిన తర్వాత వంతెనపై ట్రాఫిక్ తిరిగి యధావిధంగా కొనసాగించారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు