అలర్జీలనుంచి ఉపశమనం పొందండిలా..
- April 30, 2015
అలర్జీ బాధితులకి ప్రధాన సమస్య నిద్రలేమి. ఎలాగోలా నిద్రపట్టినా మధ్యలో మెలకువ వచ్చేయడంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యలనుంచి బయటపడాలంటే బెడ్రూమ్లో వీలైనంతవరకూ అలర్జీ కారకాలు లేకుండా జాగ్రత్త పడాలి. నిపుణులు సూచిస్తున్న కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అలర్జీ సమస్యలనుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. దుప్పట్లను, దిండ్లను వారానికి ఓ సారి వేడి నీటితో ఉతకాలి. దీంతో తవిటి పురుగులు లాంటివి ఏమైనా వుంటే చనిపోతాయి. దాంతోపాటుగా, పరుపు మొత్తం కప్పి ఉంచే అలర్జీ నిరోధక కవర్లు వాడుకుంటే మంచిది. గదిలో గాలిని శుభ్రం చేసే పరికరకాలు వాడుకోవడం ఇంకా ఉత్తమం. వాక్యూమ్ క్లీనర్తో పరుపును శుభ్రం చేసుకోవాలి. మూలల్లో ఎలాంటి దుమ్మూ లేకుండా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. బయటి నుంచి ధూళి రాకుండా కిటికీలను మూసి ఉంచుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నిద్రలేమి నుంచి అలర్జీ బాధితులు బయటపడగలుగుతారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









