అలర్జీలనుంచి ఉపశమనం పొందండిలా..
- April 30, 2015
అలర్జీ బాధితులకి ప్రధాన సమస్య నిద్రలేమి. ఎలాగోలా నిద్రపట్టినా మధ్యలో మెలకువ వచ్చేయడంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యలనుంచి బయటపడాలంటే బెడ్రూమ్లో వీలైనంతవరకూ అలర్జీ కారకాలు లేకుండా జాగ్రత్త పడాలి. నిపుణులు సూచిస్తున్న కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అలర్జీ సమస్యలనుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. దుప్పట్లను, దిండ్లను వారానికి ఓ సారి వేడి నీటితో ఉతకాలి. దీంతో తవిటి పురుగులు లాంటివి ఏమైనా వుంటే చనిపోతాయి. దాంతోపాటుగా, పరుపు మొత్తం కప్పి ఉంచే అలర్జీ నిరోధక కవర్లు వాడుకుంటే మంచిది. గదిలో గాలిని శుభ్రం చేసే పరికరకాలు వాడుకోవడం ఇంకా ఉత్తమం. వాక్యూమ్ క్లీనర్తో పరుపును శుభ్రం చేసుకోవాలి. మూలల్లో ఎలాంటి దుమ్మూ లేకుండా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. బయటి నుంచి ధూళి రాకుండా కిటికీలను మూసి ఉంచుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నిద్రలేమి నుంచి అలర్జీ బాధితులు బయటపడగలుగుతారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







