అలర్జీలనుంచి ఉపశమనం పొందండిలా..
- April 30, 2015
అలర్జీ బాధితులకి ప్రధాన సమస్య నిద్రలేమి. ఎలాగోలా నిద్రపట్టినా మధ్యలో మెలకువ వచ్చేయడంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యలనుంచి బయటపడాలంటే బెడ్రూమ్లో వీలైనంతవరకూ అలర్జీ కారకాలు లేకుండా జాగ్రత్త పడాలి. నిపుణులు సూచిస్తున్న కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అలర్జీ సమస్యలనుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. దుప్పట్లను, దిండ్లను వారానికి ఓ సారి వేడి నీటితో ఉతకాలి. దీంతో తవిటి పురుగులు లాంటివి ఏమైనా వుంటే చనిపోతాయి. దాంతోపాటుగా, పరుపు మొత్తం కప్పి ఉంచే అలర్జీ నిరోధక కవర్లు వాడుకుంటే మంచిది. గదిలో గాలిని శుభ్రం చేసే పరికరకాలు వాడుకోవడం ఇంకా ఉత్తమం. వాక్యూమ్ క్లీనర్తో పరుపును శుభ్రం చేసుకోవాలి. మూలల్లో ఎలాంటి దుమ్మూ లేకుండా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. బయటి నుంచి ధూళి రాకుండా కిటికీలను మూసి ఉంచుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నిద్రలేమి నుంచి అలర్జీ బాధితులు బయటపడగలుగుతారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







