అగ్ని ప్రమాదం: మంటల్ని అదుపు చేసిన ఫైర్ ఫైటర్స్
- November 16, 2017
షార్జా: షార్జా సివిల్ డిఫెన్స్ ఫైర్ ఫైటర్స్ చాకచక్యంగా వ్యవహరించి, భారీ అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చారు. ఇండస్ట్రియల్ ఏరియూలో గురువారం మధ్యాహ్నం పలు వేర్ హౌస్లలో ఈ అగ్నికీలలు వ్యాపించాయి. జనరల్ ట్రేడింగ్కి సంబంధించిన ఇండస్ట్రియల్ ఏరియా 6 లోని వేర్ హౌస్లు ఈ అగ్ని ప్రమాదం కారణంగా తగలబడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సివిల్ డిఫెన్స్ పేర్కొంది. మధ్యాహ్నం 12.55 నిమిషాల సమయంలో సమాచారం తమకు అందిందనీ, వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశామని షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ కల్నల్ సమి ఖామిస్ అల్ నక్బి చెప్పారు. మంటల్ని ఇతర వేర్ హౌస్లకు వ్యాపించకుండా చేయడం, అలాగే మంటల్ని పూర్తిగా అదుపు చేయడంలో ఫైర్ ఫైటర్స్ సక్సెస్ అయ్యారని ఆయన వివరించారు. కూలింగ్ ఆపరేషన్స్ చేపట్టి, పూర్తిస్థాయిలో ఆ ప్రాంతం సేఫ్ అని ఫైర్ ఫైటర్స్ నిర్ధారించిన అనంతరం, అక్కడ ఘటన ఎలా జరిగిందన్నదానిపై నిపుణుల బృందం తనిఖీలు నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









