2,700 లిరికా ట్యాబ్లెట్స్తో పట్టుబడ్డ మహిళ
- November 16, 2017దుబాయ్: ప్రిస్క్రిప్షన్ లేకుండా 2,500కి పైగా లిరికా ట్యాబ్లెట్స్ని దేశంలోకి తీసుకొచ్చేందుకు ఓ మహిళ ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆ యత్నాన్ని భగ్నం చేశారు. ఈ కేసులో 23 ఏళ్ళ లెబనీస్ మహిళకు న్యాయస్థానం 2,000 దిర్హామ్ల జరీమానా విధించింది. జులై 2న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ మహిళను అరెస్ట్ చేశారు. ట్రామా సమస్యతో ఇబ్బంది పడుతున్న తాను తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం తీసుకొచ్చినట్లుగా నిందితురాలు న్యాయస్థానం యెదుట పేర్కొంది. తన కళ్ళ యెదుటే తన సోదరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అప్పటినుంచి మానసికంగా కుంగిపోయిన తాను ఈ మందుల్ని వాడుతున్నట్లు చెప్పిందామె. అయితే మినిస్ట్రీ ద్వారా అటెస్ట్ చేసిన ప్రిస్క్రిప్షన్ కుటుంబ సభ్యుల నుంచి తెప్పించగలరా? అని న్యాయస్థానం ప్రశ్నించగా, 'సరే' అని ఒప్పుకున్న నిందితురాలు, ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకురావడంలో విఫలమవడంతో న్యాయస్థానం నిందితురాలికి శిక్ష ఖరారు చేసింది. ఆమె నుంచి మొత్తం 2,744 ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. లిరికా అనే ఈ ట్యాబెట్లను యూఏఈ నిషేధించింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ