2,700 లిరికా ట్యాబ్లెట్స్తో పట్టుబడ్డ మహిళ
- November 16, 2017
దుబాయ్: ప్రిస్క్రిప్షన్ లేకుండా 2,500కి పైగా లిరికా ట్యాబ్లెట్స్ని దేశంలోకి తీసుకొచ్చేందుకు ఓ మహిళ ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆ యత్నాన్ని భగ్నం చేశారు. ఈ కేసులో 23 ఏళ్ళ లెబనీస్ మహిళకు న్యాయస్థానం 2,000 దిర్హామ్ల జరీమానా విధించింది. జులై 2న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ మహిళను అరెస్ట్ చేశారు. ట్రామా సమస్యతో ఇబ్బంది పడుతున్న తాను తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం తీసుకొచ్చినట్లుగా నిందితురాలు న్యాయస్థానం యెదుట పేర్కొంది. తన కళ్ళ యెదుటే తన సోదరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అప్పటినుంచి మానసికంగా కుంగిపోయిన తాను ఈ మందుల్ని వాడుతున్నట్లు చెప్పిందామె. అయితే మినిస్ట్రీ ద్వారా అటెస్ట్ చేసిన ప్రిస్క్రిప్షన్ కుటుంబ సభ్యుల నుంచి తెప్పించగలరా? అని న్యాయస్థానం ప్రశ్నించగా, 'సరే' అని ఒప్పుకున్న నిందితురాలు, ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకురావడంలో విఫలమవడంతో న్యాయస్థానం నిందితురాలికి శిక్ష ఖరారు చేసింది. ఆమె నుంచి మొత్తం 2,744 ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. లిరికా అనే ఈ ట్యాబెట్లను యూఏఈ నిషేధించింది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









