2,700 లిరికా ట్యాబ్లెట్స్తో పట్టుబడ్డ మహిళ
- November 16, 2017
దుబాయ్: ప్రిస్క్రిప్షన్ లేకుండా 2,500కి పైగా లిరికా ట్యాబ్లెట్స్ని దేశంలోకి తీసుకొచ్చేందుకు ఓ మహిళ ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆ యత్నాన్ని భగ్నం చేశారు. ఈ కేసులో 23 ఏళ్ళ లెబనీస్ మహిళకు న్యాయస్థానం 2,000 దిర్హామ్ల జరీమానా విధించింది. జులై 2న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ మహిళను అరెస్ట్ చేశారు. ట్రామా సమస్యతో ఇబ్బంది పడుతున్న తాను తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం తీసుకొచ్చినట్లుగా నిందితురాలు న్యాయస్థానం యెదుట పేర్కొంది. తన కళ్ళ యెదుటే తన సోదరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అప్పటినుంచి మానసికంగా కుంగిపోయిన తాను ఈ మందుల్ని వాడుతున్నట్లు చెప్పిందామె. అయితే మినిస్ట్రీ ద్వారా అటెస్ట్ చేసిన ప్రిస్క్రిప్షన్ కుటుంబ సభ్యుల నుంచి తెప్పించగలరా? అని న్యాయస్థానం ప్రశ్నించగా, 'సరే' అని ఒప్పుకున్న నిందితురాలు, ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకురావడంలో విఫలమవడంతో న్యాయస్థానం నిందితురాలికి శిక్ష ఖరారు చేసింది. ఆమె నుంచి మొత్తం 2,744 ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. లిరికా అనే ఈ ట్యాబెట్లను యూఏఈ నిషేధించింది.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







