జెడ్డా వాటర్ ఫ్రంట్ నిర్మాణ అభివృద్ధిలో కీలకమైన చివరి దశ
- November 16, 2017
జెడ్డా:మక్కా డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ అబ్దుల్లా బిన్ బందర్ మంగళవారం జెడ్డా వాటర్ ఫ్రంట్ కార్నికే 4 మరియు 5 దశల నిర్మాణం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టు మీద జరిగిన మొత్తం పురోగతి గురించి డిప్యూటీ గవర్నర్ కు జెడ్డా మేయర్ హనీ అబూ రస క్లుప్తంగా వివరించారు.ప్రిన్స్ అబ్దుల్లా బిన్ బందర్ సైతం వివిధ సౌకర్యాలు సందర్శించి ఈ ప్రాజెక్టులో స్పష్టత కల్గిన ఆధునిక 120 కెమెరాలతో మొఖాలను గుర్తించే సాంకేతికను కలిగిన ఆ వ్యవస్థని ఆయన పరిశీలించారు. మొత్తం 720,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వాటర్ ఫ్రంట్ నిర్మాణ ప్రాజెక్ట్ సుందరంగా రూపుదిద్దుకొంటుంది. జెడ్డా సెక్రటేరియట్ చొరవకు అనుగుణంగా అందించడానికి ప్రయత్నించే శక్తి వనరులు మరియు అవుట్లెట్లను కలిగి ఉన్న స్మార్ట్ సీట్లు కూడా ఉన్నాయి. స్మార్ట్ నగరాలు అభివృద్ధిలో భాగంగా . జెడ్డా సముద్ర ముఖద్వారం ప్రాజెక్ట్ కూడా నిర్మాణం జరగనుంది. కింగ్డమ్ లో పొడవైన పాదచారుల వంతెన కలిగి కనిచే మరియు ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫహద్ రోడ్ అనుసంధానం కల్గి ఉండనుంది. ఈ ప్రాజెక్ట్ కూడా ఈత కోసం మూడు బీచ్ లను కలిగి ఉంటుంది, ఐదు బీచ్ కంట్రోల్ టవర్లు మరియు ఒక 125 మీటర్ల చేపలు పట్టుకొనే గోడతో కలిపి 15 గొడుగులు మరియు ఆరు కుటుంబ రెస్టారెంట్లు, చిన్న పడవలు మరియు ఓడలో ఎక్కడానికి వీలుగా ఒడ్డు నుండి సముద్రంలోకి నిర్మించబడిన తేలియాడే వేదిక ( ఫ్లోటింగ్ డాక్ ) కోసం ఒక మరీనా. సముద్ర కెరటాలను నిలువరించే 480 మీటర్ల గోడ,120 మరుగుదొడ్లు, గాలి, వెలుతురు బాగా వచ్చు విధంగా తెరచి ఉన్న 24 వేసవి గృహాలు (కియోస్కలు) మరియు 14 నీటిని వెదజల్లే ఫౌంటైన్లు ఉన్నాయి, వాటిలో నాలుగు అందరితో కలిసేవిధంగా మరియు డ్యాన్స్ కోసం ఏర్పాటుచేసిన ఫౌంటైన్లు. జెడ్డా వాటర్ ఫ్రంట్ అభివృద్ధిలో ఈ దశ అతి పెద్దదైనది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









