కప్పు నీటిలో కర్పూరం బిళ్ళలేసి మంచం కింద పెడితే?
- November 17, 2017
వర్షాకాలంలో కప్పు నీటిలో కర్పూరం బిళ్ళలేసి మంచం కింద పెడితే దోమల బెడద తగ్గుతుంది. అలాగే వర్షాకాలం ఇంటిని వేడి నీటిలో శుభ్రపరచయం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. జ్వరం, బలుబు వంటి రుగ్మతలు దరిచేరకుండా వుండాలంటే వర్షాకాలంలో ఇంటిని శుభ్రంగా వుంచుకోవాలి. తడి లేకుండా పొడిబట్టతో ఇంటిని శుభ్రపరుస్తూనే వుండాలి.
ఇక కర్పూరంతో ఈగలు, దోమలు ఇంట్లోకి రానీయకుండా చేయొచ్చు. అర బకెట్ నీళ్ళలో ఒక గుప్పెడు వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చేవరకు మరిగించి ఫ్లోర్ను తుడిస్తే క్రిములు నశించడంతో పాటు ఈగలు, దోమలు రావు. వర్షాకాలంలో స్నానం చేసే వేడి నీటిలో కొద్దిగా కర్పూరాన్ని వేసి స్నానం చేస్తే శరీరంపై ఉన్న క్రిములన్నీ చనిపోతాయి.
ఉదయం బ్రష్ చేసేప్పుడు దానిపై కర్పూరం వేసుకుని దంతాలు శుభ్రం చేస్తే నోటి దుర్వాసన పోతుంది. దంతాలకు కీడు చేసే క్రిములు తొలగిపోతాయి. చుండ్రు సమస్య ఉన్నవాళ్ళు కొబ్బరి నూనెలో కర్పూరం వేసి గంట తర్వాత దానిని జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









