ప్రపంచ సుందరిగా భారతీయ యువతి
- November 18, 2017
చైనా: ప్రపంచ సుందరిగా భారతీయ యువతి మానుషి చిల్లార్ విజయం సాధించి కిరీటం సొంతం చేసుకుంది. చైనాలోని సన్యా సిటీ ఎరీనా ప్రాంతంలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పలు దేశాలకు చెందిన 118 మంది ముద్దుగుమ్మలు పాల్గొన్నారు. శనివారం మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ పోటీలను నిర్వహించారు. హరియాణాకు చెందిన 21ఏళ్ల వైద్య విద్యార్థిని చిల్లార్ గ్రాండ్ ఫైనల్లో అందరినీ వెనక్కి నెట్టి కిరీటాన్ని సొంతం చేసుకుంది. మొదటి రన్నరప్గా మెక్సికోకి చెందిన ఆండ్రియా మేజా నిలవగా.. రెండో రన్నరప్గా ఇంగ్లాండ్కు చెందిన స్టీఫెనీ హిల్ నిలిచింది.
2000లో బాలీవుడ్ నటి ప్రియాంకాచోప్రా మిస్వరల్డ్గా నిలిచింది. దాదాపు 17ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్థానాన్ని భారత్కు చెందిన చిల్లార్ దక్కించుకుంది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







