నంది అవార్డుల వివాదంపై స్పందించిన మంత్రి లోకేష్‌

- November 20, 2017 , by Maagulf
నంది అవార్డుల వివాదంపై స్పందించిన మంత్రి లోకేష్‌

నంది అవార్డుల వివాదంపై స్పందించారు మంత్రి లోకేష్‌. నాన్‌ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. మూడేళ్ల అవార్డులు ఒకేసారి ఇస్తే కావాలనే వివాదం చేస్తున్నారన్నారు. అవార్డులపై చెలరేగిన వివాదంపై సీఎం చాలా బాధపడ్డారన్నారు మంత్రి లోకేశ్‌. ప్రత్యేక హోదా కోసం విజయవాడలో ధర్నా చేసే బదులు ఢిల్లీలో చేస్తే బాగుంటుందన్నారు. ఈ ధర్నాల కోసం కొంతమంది ఉదయం ఫ్లైట్‌కు విజయవాడకు వచ్చి.. మధ్యాహ్నం ఫ్లైట్‌కు కొంతమంది వెళ్లిపోతున్నారంటూ విమర్శించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే వారికి ఆంధ్రాలో ఆధార్‌ కార్డ్‌ గానీ, ఓటరు కార్డ్‌గానీ లేవన్నారు లోకేష్‌. స్థానికత లేనివాళ్లకు తమను విమర్శించే హక్కు లేదన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com