కలిసి ముందడుగు వేద్దాం: చర్చలకు ఖతార్ పిలుపు
- November 20, 2017
ఖతార్: ఖతార్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ సుల్తాన్ బిన్ సాద్ అల్ మురైఖి మాట్లాడుతూ, అరబ్ నేషన్కి సంబంధించి రాజకీయ, ఆర్థిక, భద్రత వంటి విషయాల్లో అందరం కలిసి ముందడుగు వేయాల్సి ఉందని అన్నారు. అరబ్ దేశాల్లో గత కొంతకాలంగా నెలకొన్న దురదృష్టకర వాతావరణం మారిపోవాల్సి ఉందనీ, సమస్యలేవైనా ఉంటే చర్చించి, పరిష్కారం కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు. కైరోలోని అరబ్ లీగ్ హెడ్ క్వార్టర్స్లో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యల చేశారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం అరబ్ దేశాలపై తీవ్రంగా పడితే, దాన్ని అరబ్ దేశాలన్నీ సంయుక్తంగా ఎదుర్కొనాల్సి ఉంటుందనీ, దానికి అందరం కలిసి పనిచేయాల్సి ఉందని, పరస్పర చర్చల ద్వారా విభేదాల్ని పరిష్కరించుకుంటే సమస్యను సంఘటితంగా ఎదుర్కోవడం తేలికని చెప్పారు. రియాద్పై ఇటీవల జరిగిన మిస్సైల్ ఎటాక్ని మురైకి, ఖతార్ తరఫున తీవ్రంగా ఖండించారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







