కలిసి ముందడుగు వేద్దాం: చర్చలకు ఖతార్ పిలుపు
- November 20, 2017
ఖతార్: ఖతార్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ సుల్తాన్ బిన్ సాద్ అల్ మురైఖి మాట్లాడుతూ, అరబ్ నేషన్కి సంబంధించి రాజకీయ, ఆర్థిక, భద్రత వంటి విషయాల్లో అందరం కలిసి ముందడుగు వేయాల్సి ఉందని అన్నారు. అరబ్ దేశాల్లో గత కొంతకాలంగా నెలకొన్న దురదృష్టకర వాతావరణం మారిపోవాల్సి ఉందనీ, సమస్యలేవైనా ఉంటే చర్చించి, పరిష్కారం కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు. కైరోలోని అరబ్ లీగ్ హెడ్ క్వార్టర్స్లో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యల చేశారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం అరబ్ దేశాలపై తీవ్రంగా పడితే, దాన్ని అరబ్ దేశాలన్నీ సంయుక్తంగా ఎదుర్కొనాల్సి ఉంటుందనీ, దానికి అందరం కలిసి పనిచేయాల్సి ఉందని, పరస్పర చర్చల ద్వారా విభేదాల్ని పరిష్కరించుకుంటే సమస్యను సంఘటితంగా ఎదుర్కోవడం తేలికని చెప్పారు. రియాద్పై ఇటీవల జరిగిన మిస్సైల్ ఎటాక్ని మురైకి, ఖతార్ తరఫున తీవ్రంగా ఖండించారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









