కలిసి ముందడుగు వేద్దాం: చర్చలకు ఖతార్ పిలుపు
- November 20, 2017ఖతార్: ఖతార్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ సుల్తాన్ బిన్ సాద్ అల్ మురైఖి మాట్లాడుతూ, అరబ్ నేషన్కి సంబంధించి రాజకీయ, ఆర్థిక, భద్రత వంటి విషయాల్లో అందరం కలిసి ముందడుగు వేయాల్సి ఉందని అన్నారు. అరబ్ దేశాల్లో గత కొంతకాలంగా నెలకొన్న దురదృష్టకర వాతావరణం మారిపోవాల్సి ఉందనీ, సమస్యలేవైనా ఉంటే చర్చించి, పరిష్కారం కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు. కైరోలోని అరబ్ లీగ్ హెడ్ క్వార్టర్స్లో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యల చేశారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం అరబ్ దేశాలపై తీవ్రంగా పడితే, దాన్ని అరబ్ దేశాలన్నీ సంయుక్తంగా ఎదుర్కొనాల్సి ఉంటుందనీ, దానికి అందరం కలిసి పనిచేయాల్సి ఉందని, పరస్పర చర్చల ద్వారా విభేదాల్ని పరిష్కరించుకుంటే సమస్యను సంఘటితంగా ఎదుర్కోవడం తేలికని చెప్పారు. రియాద్పై ఇటీవల జరిగిన మిస్సైల్ ఎటాక్ని మురైకి, ఖతార్ తరఫున తీవ్రంగా ఖండించారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం